Actress Radhika: ఇండస్ట్రీలోని సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక ఏ విషయమైనా ఎంతో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాధిక అమ్మాయిల పెళ్లి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూలో భాగంగా ప్రజెంట్ జనరేషన్ లో ఉన్నటువంటి పిల్లల గురించి పెళ్లి గురించి ఆమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ప్రస్తుత కాలంలో పిల్లల పుట్టాలంటే పెళ్లి తప్పనిసరిగా చేసుకోవాల్సిందేనా అనే ప్రశ్న ఈమెకు ఎదురవడంతో ఈ ప్రశ్నకు రాధిక తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్లి విషయంలో పూర్తిగా వారి ఆలోచన విధానాన్ని మార్చుకున్నారని తెలిపారు.
అమ్మాయిలు కూడా బాగా చదువుకొని ఫైనాన్షియల్ గా ఎవరి సపోర్ట్ లేకుండా ఉండడంతో వారికి ఆడ మగ అనే భేదాలు లేకుండా పోయాయని, పెళ్లి విషయంలో అమ్మాయిలు ఆలోచన ధోరణి మారిపోయిందని తెలియజేశారు. కొద్దిరోజుల క్రితం తాను కొంతమంది హీరోయిన్లతోనూ అలాగే అమ్మాయిలతోనూ ఈ పెళ్లి విషయం గురించి మాట్లాడితే…పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడం ఎందుకు లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటూ సమాధానం చెప్పారు.
పిల్లలు కావాలి అనుకుంటే పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రస్తుతం సరోగసి, ఐవిఎఫ్ వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా.. పిల్లలు కావాలంటే మగాళ్ళ అవసరం ఏముంది అంటూ సమాధానం చెప్పారని రాధిక వెల్లడించారు. ఈ విధంగా పెళ్లి విషయంలో అమ్మాయిల ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయిందని,ఇది తప్పు అని చెప్పిన వారు అర్థం చేసుకునే పరిస్థితులలో అమ్మాయిలు లేరు అంటూ ఈ సందర్భంగా రాధిక చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…
అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఉత్కంఠభరిత దశకు టోర్నీ చేరుకుంది. గ్రూప్ మ్యాచ్ల సందడి ముగిసిన తర్వాత ఇప్పుడు అందరి చూపు…