Director Geetha Krishna : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపక్షం తెలుగు దేశమైనా అధికారపక్షం విమర్శలు మాత్రం జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీదే. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ఇంతవరకూ విమర్శలు చేస్తూ వచ్చిన వైసీపీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యక్తిత్వం లేదు, సొంతంగా ఆలోచించలేడు అంటూ విమారుస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి విమర్శిస్తున్నారు. ఇక రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, బొత్స వంటి వారి నోటికి అదుపు లేకుండా ఉంది. ఇక పవన్ కళ్యాణ్, బాలకృష్ణ షో అన్ స్టాపబుల్ లో పాల్గొనడం గురించి వైసీపీ పార్టీ నేత మంత్రి రోజా మెగా ఫ్యామిలీ మీద అలాగే నందమూరి బాలకృష్ణ మీద చేసిన కామెంట్స్ మరోసారి వైరల్ అయ్యాయి. ఇక ఈ ఇష్యూ గురించి డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడారు.
రోజా ఎలాంటిదో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు…
ఏపీ మంత్రి రోజా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గురించి విమర్శించడం కామన్ అయితే ఈ సారి మెగా ఫ్యామిలీ ఎవరికీ సహాయం చేయరు అంటూ మాట్లాడి వైరల్ అయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరులు ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎవరికీ సహాయం చేయలేదు అంటూ మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీన్ని గురించి గీతా కృష్ణ మాట్లాడుతూ రోజా ఆడవారు మాట్లాడలేని బూతులను కూడా సభల్లో మాట్లాడిన ఘటనలు ఉన్నాయి.
తాను విమర్శిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇండస్ట్రీలో కానీ ఎపుడు మాట్లాడినా ఎంతో కొంత కొద్ది మంది పైన అయినా ప్రభావం చూపించవచ్చు. రోజాను చాలా మంది పరుషంగా విమర్శిస్తుంటారు. ఇప్పుడు ముగ్గురు పెద్ద హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తే వారి వారి ఫాన్స్ ఊరికే ఉండరు ఆమెను బాగా విమర్శిస్తారని తెలిసినా సీఎం దగ్గర మెప్పుకోసం ఎంతో కొంత నా వాదన సమర్తిస్తారని భావించి ఉండవచ్చు అంటూ తెలిపారు. ఒకప్పట్లో మెగా ఫ్యామిలీ ఎవరికీ సహాయం చేయరు అనే అపవాదు ఉండేది, దీనికి కారణం రాజకీయంగా బురద వేయడమే. అలాంటి ఆరోపణలే మళ్ళీ రోజా కూడా చేస్తోంది. అందులోనూ ఇండస్ట్రీకి సంబందించిన వ్యక్తి కావడం వల్ల కొన్ని వర్గాల ప్రజలు ఈ ఆరోపణలను నమ్ముతారు అంటూ అభిప్రాయపడ్డారు.
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…