Marudhuri Raja : తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మరుధూరి రాజా స్వస్థలం గుంటూరు. మొదటి సినిమా ‘ఒంటరి పోరాటం’ నుండి రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఎక్కువ సినిమాలు చేసిన రాజా తన అనుభవాలు, దర్శకుడిగా చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైంది, నటుడుగా ఎందుకు రాలేదనే విషయాల గురించి స్పందించారు. ఇక హిట్లర్ సినిమాకు రైటర్ గా పనిచేయాల్సిన తాను ఎలా ఆ అవకాశం కోల్పోయింది తెలిపారు.
హిట్లర్ లో మొదట మోహన్ బాబును అనుకుని…
ఎడిటర్ మోహన్ గారికి మరుధూరి రాజా గారికి మంచి సంబంధాలు మొదటి నుండి ఉండేవి. అలా ఉన్న స్నేహంతోనే ఎడిటర్ మోహన్ మలయాళంలో విడుదల కాబోతున్న మమ్ముట్టి సినిమా హిట్లర్ గురించి రాజా కు చెప్పి మోహన్ బాబుతో తీయడానికి ఈవివి సత్యనారాయణ ను ఒప్పించండి అని పంపారట. అయితే ఈవివి అప్పటికే రెండు సినిమాలు మోహన్ బాబు తో తీసాను మళ్ళీ వద్దు అని చెప్పేసాడట.
దీనితో ఆ ప్రాజెక్ట్ వదిలేసినా మళ్ళీ కొద్దిరోజులకు ఫోన్ చేసి చిరంజీవి గారు ఓకే చేసారు హిట్లర్ కథను అని ఎడిటర్ మోహన్ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారట మరుధూరి రాజా. ఇక చిరంజీవి కి రైటర్ గా పనిచేసే అవకాశం వచ్చిందనుకుంటే అంతలోనే వేరే వాళ్ళను రైటర్ గా నియమించుకున్నారు అంటూ అప్పట్లో జరిగిన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు మరుధూరి రాజా.
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ వైష్ణవక్షేత్రాలలో ఒకటైన సింహాచలం దేవాలయంలో జరగబోయే చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది విశేషంగా నిర్వహించే…
తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…