Marudhuri Raja : తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మరుధూరి రాజా స్వస్థలం గుంటూరు. మొదటి సినిమా ‘ఒంటరి పోరాటం’ నుండి రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఎక్కువ సినిమాలు చేసిన రాజా తన అనుభవాలు, దర్శకుడిగా చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైంది, నటుడుగా ఎందుకు రాలేదనే విషయాల గురించి స్పందించారు. ఇక హిట్లర్ సినిమాకు రైటర్ గా పనిచేయాల్సిన తాను ఎలా ఆ అవకాశం కోల్పోయింది తెలిపారు.
హిట్లర్ లో మొదట మోహన్ బాబును అనుకుని…
ఎడిటర్ మోహన్ గారికి మరుధూరి రాజా గారికి మంచి సంబంధాలు మొదటి నుండి ఉండేవి. అలా ఉన్న స్నేహంతోనే ఎడిటర్ మోహన్ మలయాళంలో విడుదల కాబోతున్న మమ్ముట్టి సినిమా హిట్లర్ గురించి రాజా కు చెప్పి మోహన్ బాబుతో తీయడానికి ఈవివి సత్యనారాయణ ను ఒప్పించండి అని పంపారట. అయితే ఈవివి అప్పటికే రెండు సినిమాలు మోహన్ బాబు తో తీసాను మళ్ళీ వద్దు అని చెప్పేసాడట.
దీనితో ఆ ప్రాజెక్ట్ వదిలేసినా మళ్ళీ కొద్దిరోజులకు ఫోన్ చేసి చిరంజీవి గారు ఓకే చేసారు హిట్లర్ కథను అని ఎడిటర్ మోహన్ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారట మరుధూరి రాజా. ఇక చిరంజీవి కి రైటర్ గా పనిచేసే అవకాశం వచ్చిందనుకుంటే అంతలోనే వేరే వాళ్ళను రైటర్ గా నియమించుకున్నారు అంటూ అప్పట్లో జరిగిన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు మరుధూరి రాజా.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…