సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పని చేసే సెలబ్రిటీల పై రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో వాస్తవం ఉన్నా లేకున్నా వారి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో రావడం సర్వసాధారణమే ఈ విధంగా ఆనందం సినిమాలో నటించినటువంటి హీరోయిన్ రేఖ పై అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందనే ఈ విషయంపై నటి రేఖ స్పందిస్తూ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నిజానికి ఈమె కన్నడ పరిశ్రమకు చెందిన ఆమె అయినప్పటికీ తెలుగులో ఆనందం సినిమాతో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో కొన్ని ఫ్లాపులు రాగానే బుర్ర తక్కువ ఆలోచనలు చేసి తెలుగు సినిమా పరిశ్రమని వదిలి కన్నడ పరిశ్రమ వైపు వెళ్లానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు. తెలుగులో ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని కాదని కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్లడమే తాను చేసిన పెద్ద తప్పు అని ఈ సందర్భంగా రేఖ తెలియజేశారు.
తెలుగు సినిమా చేస్తున్న సమయంలో తన గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. తను ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాననే వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున రావడంతో నటి తన గురించి వస్తున్న మరణ దోషం తొలగిపోవాలంటే పేరు మార్చు కోవాలని భావించింది. అందుకే రేఖ వేదవ్యాస్ అయిన తన పేరును ఆనందం సినిమాలో నటించడం వల్ల ఆనందం రేఖగా మారిపోయింది.
ఒకానొక సమయంలో మణిరత్నం లాంటి అగ్ర దర్శకుల సినిమా అవకాశాలు వచ్చినా కాదనడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ సినిమా అవకాశాలను మిస్ చేసుకున్నందుకు ఎంతో బాధపడుతున్నారు.ప్రస్తుతం కన్నడ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తున్న ఈమె తెలుగు సినిమా అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.
ప్రస్తుతం తన శరీర బరువు అధికంగా ఉండటం వల్ల తన దృష్టిని మొత్తంశరీర బరువును తగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని అయితే తనకు తెలుగులో ఎలాంటి అవకాశాలు వచ్చినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తన గురించి వచ్చిన రూమర్లపై,తన మనసులో ఉన్న మాటను కూడా ఈ సందర్భంగా బయట పెట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…