Actress Savitri: మహానటి సావిత్రికి చివరి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎందుకు సాయం చేయలేదో తెలుసా?

Actress Savitri: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో ఎత్తుపల్లాలను చూసి ఇండస్ట్రీలో తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర సంపాదించుకున్న మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి అగ్ర హీరోలు అందరూ సరసన నటించిన పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం హిందీ భాషలలో కూడా ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈమె కాల్ షీట్ల కోసం ఎదురు చూసేవారంటే ఈమెకు అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో మనకు తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఈమె రహస్యంగా జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహమైన తర్వాత ఈమె జీవితం పూర్తిగా మారిపోయింది. తాను సంపాదించిన దానిలో ఎంతో దానా ధర్మాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఈమె చివరి క్షణాలలో మాత్రం దుర్భరమైన జీవితాన్ని అనుభవించారని తెలుస్తోంది. ఇలా తనవాళ్లేనని నమ్మి ఉన్న ఆస్తులను మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా సినిమా అవకాశాలు రాకపోవడంతో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని పూర్తిగా తాగుడుకు బానిసయ్యి చివరి క్షణాలను ఎంతో దుర్భరంగా గడుపుతూ తుది శ్వాస విడిచారు.

Actress Savitri: తన మొండి వైఖరి అందరినీ దూరం చేసిందా…

ఇలా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందిన ఈమె చివరికి ఏ ఒక్కరి సహాయ సహకారం తీసుకోలేదని చెప్పాలి.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి హీరోల సరసన నటించి ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను అందుకున్న సావిత్రికి చివరికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కూడా సహాయం చేయలేదని తెలుస్తుంది. అయితే ఇలా వీరు సహాయం చేయకపోవడానికి ఒక కారణం ఉందని, అది కేవలం సావిత్రి మొండి వైఖరి కారణమంటూ ఇండస్ట్రీ టాక్.ఈమె తాగుడుకు బానిసైన సమయంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎన్నోసార్లు తను ఆ వ్యసనానికి దూరం కావాలని సూచించారట అయినప్పటికీ ఈమె తన మొండి వైఖరిని ఏమాత్రం మానుకోకపోవడంతో చివరి రోజులలో కూడా ఎన్టీఆర్ ఏఎన్నార్ వంటి వారు కూడా ఆమెను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.