Actress Shiva Parvathi : తెలుగు వెండితెర మీద తల్లి పాత్రలలో దాదాపు 250 సినిమాలలో నటించిన శివ పార్వతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1991 లో రామానాయుడు నిర్మించిన పరుచూరి గోపాల కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సర్పయాగం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో శివ పార్వతి నటించగా… హీరోయిన్ తండ్రి పాత్రలో శోభన్ బాబు గారు నటించడం విశేషం. సర్పయాగం, ఒరేయ్ రిక్షా, మావి చిగురు, అన్నయ్య, సంక్రాంతి, శ్రీరామ రాజ్యం, శ్రీరామదాసు, సీమ సింహం మొదలైన సినిమాలలో నటించారు. సినిమాలలోనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ పార్వతి గారు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.
రామ్ గోపాల్ వర్మ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను…
ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు సంబందించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాటక రంగం యొక్క విశిష్టత గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో నాటక రంగం కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలను జనంలోకి తీసుకు వెళ్ళడానికి ఒక మాద్యమం లాగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఏదైనా చెబితే వినడం కన్నా దృశ్యరూపంలో చూపిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇటీవల కృష్ణంరాజు గారు స్వర్గస్థులు అయినప్పుడు అర్జీవీ చేసిన ట్వీట్ గురించి అడిగితే తన అభిప్రాయాన్ని తెలియజేసారు.
ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను అని తెలియజేసారు. గొప్ప లెజెండ్రి నటుడు చనిపోతే కనీసం ఒక రోజు షూటింగులు ఆపి వారి మీద మనకు ఉన్న గౌరవం తెలియజేయడం మన బాధ్యత అని చెప్పారు. వారు జీవించినంత కాలం సినిమాల కోసమే పాటుబడ్డారు, అలాంటి వారు చనిపోతే ఒకరోజు కాకపోయినా సగం రోజు అయినా షూటింగులు ఆపాల్సిన్నింది అని చెప్పారు. మీరు ఈ విషయం గురించి అపుడు చెప్పలేదా అని అడుగగా ఇండస్ట్రీలో పెద్దవారికి చెప్పే స్థాయిలో నేను లేను, నిజాలు మాట్లాడుకోవాలి నేను మరి ఆ పొజిషన్లో లేను, నేను ఇలా చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం మాత్రమే చెప్పగలను అని చెప్పుకొచ్చారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…