Actress Siva Parvathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, హీరోగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రమశిక్షణకు మారుపేరు అని అందరికీ తెలిసిందే. ఇక షూటింగ్ లొకేషన్లో ఎవరైనా ఏ మాత్రం క్రమశిక్షణ పాటించకపోతే వారిని చెడామడా తిట్టేస్తారు.ఈ క్రమంలోనే నటి శివపార్వతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మోహన్ బాబు గురించి ఒక సంఘటనను తెలియజేశారు.
లక్ష్మి ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్లో రౌడీ గారి పెళ్ళాం సినిమా చేస్తున్న సమయంలో తాను ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని తెలిపారు.ఈ సినిమా ద్వారానే తాను లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్ బ్యానర్ లో మొట్టమొదటి సారిగా నటించానని తెలిపారు. ఇక ఈ సినిమాలో నేను చాలా చిన్న క్యారెక్టర్ లో నటించాను. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శోభన నటించారని శివపార్వతి తెలిపారు. ఇక షూటింగ్ లొకేషన్ లో ఒక రోజు శోభన నాకు విష్ చేయకుండా వెళ్లిపోయారు.
ఈ విషయం గమనించిన మోహన్ బాబు శోభనను నా దగ్గరకు పిలిచి ఆవిడ ఎవరు అనుకుంటున్నావు ఆమె ఎక్స్లెంట్ ఆర్టిస్ట్ తనకి ఎందుకు విష్ చేయలేదు అని తన ఎదురుగానే శోభనను తిట్టారని ఈ సందర్భంగా శివ పార్వతి వెల్లడించారు. ఇలా ఆయన ఎందుకు చెబుతున్నారు అని అనుకున్నాను.ఇది తప్పు అంటూ ఆ రోజు మోహన్ బాబు శోభనను తిట్టారు. ఇక మోహన్ బాబు దృష్టిలో ఒకసారి ఆర్టిస్ట్ అని ఆలోచన వచ్చిందంటే వాళ్ళు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్ట్ అనే తేడాలు అతనికి ఉండవని తెలిపారు.
ఇకపోతే మోహన్ బాబు క్రమశిక్షణ లేకపోతే ప్రతి ఒక్కరిని గట్టిగా అరుస్తారని అయితే ఇలా అరిచే వాళ్లే ఇండస్ట్రీకి కావాలని ఈమె తెలిపారు.ఒకప్పుడు ప్రతి ఒక్కరూ సరైన సమయానికి షూటింగ్ లొకేషన్ కి చేరుకొని సినిమాలలో నటించే వారు. అయితే ప్రస్తుతం ఉదయం 10 గంటలైనా అయినా ఒక షార్ట్ కూడా పూర్తి కావడంలేదని ప్రస్తుతం మన ఆర్టిస్టులలో సమయ పాలన లేదని, ఇలా క్రమశిక్షణలో పెట్టేవారు ఇండస్ట్రీకి అవసరం అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…