Director Parvatheesam : పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన అనంతరం కేరింత సినిమాతో నటుడు పార్వతీశం పరిచయమయ్యారు. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రెండు సినిమాలలో నటించారు. మారుతి దర్శకత్వంలోనూ రోజులు మారాయి, భలే మంచి చౌక బేరం వంటి రెండు సినిమాలలో నటించినట్టు ఈయన తెలిపారు.
ఇకపోతే కేరింత సినిమాలో నటించడం కోసం పార్వతీశం దిల్ రాజుకు డబ్బులు ఇచ్చినట్లు పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి ప్రశ్నించగా దిల్ రాజు గారికి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి అంటూ ఈయన ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇకపోతే మారుతి గారు మీకు పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బందులు పెట్టారు అని కూడా వార్తలు వచ్చాయని ప్రశ్నించగా ఈ విషయం గురించి పార్వతీశం క్లారిటీ ఇచ్చారు.
ఇప్పటి వరకు తాను నటించిన సినిమాలలో ఒక్కరు కూడా పేమెంట్ ఎగ్గొట్ట లేదని మారుతి గారు కూడా ఎప్పుడూ తనని పేమెంట్ కోసం ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక మారుతి గారి ప్రొడక్షన్ లో చేసిన ఈ రెండు సినిమాలకు కూడా ఆయన కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చారని తెలిపారు. ఇక సార్ పేమెంట్ కావాలని అతనికి చిన్న మెసేజ్ చేస్తే చాలు గంటలో నా అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయని తెలిపారు.
ఒకవేళ క్యాష్ కనుక ఉంటే ఆఫీస్ కి వెళ్లి తీసుకో అంటూ తనకు సమాధానం చెబుతారు కానీ ఆయన పేమెంట్ విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. ఇక చోటా కె నాయుడు గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో మంచివారని ఆయన స్టైల్, ఆయన డిగ్నిటీ ఎంతో బాగుంటుందని ఈ సందర్భంగా నటుడు పార్వతీశం చోటా కె నాయుడు గురించి తెలిపారు.తను ఒకసారి ఎవరైనా ఇష్టపడితే ఎంతో ప్రేమగా చూసుకుంటారని అంత మంచి మనస్తత్వం అని పార్వతీశం ఈ సందర్భంగా చోటా కె నాయుడు గురించి తెలిపారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…