Actress Sukanya: 80, 90లలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ప్రస్తుతం కొందరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీగా ఉండగా మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఈ విధంగా 80,90 లలోఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ సుకన్య గురించి ఈ తరం వారికి తెలియకపోయినా నిన్నటి తరం వారికి ఈమె సుపరిచితమే.
ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన తెలుగు తమిళ సినిమాలలో నటించిన ఈమె పెద్దరికం సినిమా ద్వారా జగపతిబాబు సరసన తెలుగు పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. తమిళ నిర్మాత రమేష్ కుమార్తెగా భారతీయ రాజా దర్శకత్వంలో వచ్చిన ఫుదు నెల్లు పుదు నాథు అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యారు.ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుకన్య ఉన్నఫలంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ప్రస్తుతం సుకన్య విదేశాలలో నివసిస్తున్నారు అయితే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమాలో మరోసారి జగపతిబాబుకి భార్యగా మహేష్ బాబుకి తల్లిగా సుకన్య సందడి చేశారు.దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.
ఇకపోతే పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఈమె కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో అమృతవల్లి పాత్రలో నటించి సందడి చేస్తున్నారు. ఇక తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…