చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయికుమార్ తనయుడు ఆది ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఆది మొదట ‘ప్రేమ కావాలి’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన హిట్ దొరకలేదు ఆదికి. దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో ప్రస్తుతం తీస్ మార్ ఖాన్ చిత్రం తెరకెక్కుతోంది.
ప్రొడక్షన్ నెంబర్-3 గా విజన్ సినిమాస్ బ్యానర్పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. దసరా పండుగ రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినీ బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆది ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతుంది. ఫస్ట్ లుక్ లో అతడు సిగరెట్ కాలుస్తూ.. ఊర మాస్ లా కనిపించాడు. ఈ సినిమాలో అతడు రౌడీగా, పోలీస్ , స్టూడెంట్గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత దర్శకుడిగా వహిస్తున్నాడు.
దీనికి సినమాటోగ్రఫిగా బాల్ రెడ్డి వహిస్తున్నాడు. ఎడిటింగ్ బాధ్యతలు మణికాంత్ వ్యవహరిస్తున్నాడు. ఈ తీస్ మార్ ఖాన్ చిత్రంపై ఆ సినీ సభ్యులు పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకున్నారు. ఇలాంటి పాత్ర ఆది అంతకముందు సినిమాలో చేయలేదని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ప్రేమతో మొదలైన ఒక బంధం చివరకు నేరంగా మారిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట చూసిన వారికి…
బిగ్బాస్ ఫేమ్ అషు రెడ్డి, టెక్కీ ధర్మేంద్ర మధ్య నెలకొన్న ఆర్థిక వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. పెళ్లి…
దక్షిణ భారత సినీ ప్రపంచంలో తన ప్రత్యేక నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యరాజ్ ప్రయాణం ఎంతో కష్టసాధ్యంగా సాగింది. నేటి…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి తన సినీ ప్రయాణంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా…
ప్రమాదకర బైక్ స్టంట్లపై హైదరాబాద్ పోలీసులు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. నగర పోలీస్ కమిషనర్ వి. సి.…
టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…