కొన్ని రోజుల కిందట బైక్ ప్రమాదంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అతడు ఆసుపత్రిని నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 35 రోజుల పాటు అతడు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నాడు.
ఈ క్రమంలో అతడు పూర్తిగా కోలుకొని అతడు ఇంటికి వెళ్లాడు. ఈ విషయాన్ని మెగస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ ఇలా ఉన్నారు. ‘అనుకోకుండా ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా చికిత్స పొందిన సాయి కోలుకొని క్షేమంగా ఇంటికి చేరాడు.. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భవిష్యత్లో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని శక్తి స్వరూపిణిని ప్రార్ధిస్తున్నాను. తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడ్డారు’ అని అన్నాడు.అలాగే తేజ్ ఆరోగ్యంగా ఉండాలని.. ఆలయాల్లో పూజలు చేసి.. ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అంటూ పవన్ చెప్పుకొచ్చాడు.
వారి పూజలు ఫలించాయని పేర్కొన్నాడు. తేజ్ క్షేమంగా తిరిగి ఇంటికి రావడంపై మెగా అభిమానులు, మెగా బ్రదర్స్ ఆనందం వ్యక్తం చేశారు. అది పండుగ రోజు ఇంటికి రావడంతో ఆ ఆనందం ఇంకా రెంట్టింపు అయింది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…