Aditi Rao -Siddharth: టాలీవుడ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం నిన్న హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగింది.ఈయన నిశ్చితార్థ కార్యక్రమానికి టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. రామ్ చరణ్ దంపతులతో పాటు నాగార్జున దంపతులు చిరంజీవి దంపతులు కూడా హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలలో నటి అదితి రావు హైదరి నటుడు సిద్ధార్థ్ కూడా సందడి చేయడం గమనార్హం.
గత కొద్దిరోజులుగా అదితి రావు సిద్ధార్థ్ ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వీరిద్దరూ లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి. అలాగే నటి అదితి రావు పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హాట్ అంటూ తనకు స్పెషల్ విషెస్ తెలియజేయడంతో వీరి మధ్య ఉన్న రిలేషన్ కు మరింత బలం చేకూరింది.
ఇలా తరచూ వీరి రిలేషన్ గురించి వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఇద్దరిలో ఎవరు కూడా స్పందించలేదు. ఈ క్రమంలోనే వీరి గురించే వచ్చే వార్తలు నిజమేనని అందరూ భావించారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి శర్వానంద్ నిశ్చితార్థానికి రావడంతో మరోసారి ఈ వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే శర్వానంద్ నిశ్చితార్థ కార్యక్రమంలో సిద్ధార్థ్, అదితి ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఇకపోతే శర్వానంద్ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాల్లో సిద్ధార్థ్ కు జోడిగా అదితి రావు హైదరి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉండడంతోనే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని వార్తలు బలమయ్యాయి. ఏది ఏమైనా ప్రస్తుతం వీరిద్దరూ శర్వానంద్ నిశ్చితార్థంలో సందడి చేయడంతో వీరి రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చినట్టేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…