Adivi Sesh:ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలలో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తాజాగా మేజర్, హిట్ 2 వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు కూడా మంచి హిట్ కావడంతో ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పెరిగింది.
ఈ క్రమంలోనే పలువురు దర్శక నిర్మాతలు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు అడివి శేష్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు.ఇకపోతే తాజాగా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సలామ్ వెంకీ. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హీరో అడివి శేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శేష్ మాట్లాడిన అనంతరం ఆయన సీనియర్ నటి రేవతికి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శేష్ ఎలాంటి గర్వం లేకుండా వేదికపై రేవతి పాదాలకు నమస్కరించడంతో ఈయన సంస్కారానికి అక్కడున్నటువంటి వారు మాత్రమే కాకుండా నేటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇలా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…