Adivi Sesh:ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస హిట్ సినిమాలలో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తాజాగా మేజర్, హిట్ 2 వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలు కూడా మంచి హిట్ కావడంతో ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పెరిగింది.
ఈ క్రమంలోనే పలువురు దర్శక నిర్మాతలు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు అడివి శేష్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నారు.ఇకపోతే తాజాగా సీనియర్ నటి రేవతి దర్శకత్వంలో కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సలామ్ వెంకీ. ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హీరో అడివి శేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శేష్ మాట్లాడిన అనంతరం ఆయన సీనియర్ నటి రేవతికి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శేష్ ఎలాంటి గర్వం లేకుండా వేదికపై రేవతి పాదాలకు నమస్కరించడంతో ఈయన సంస్కారానికి అక్కడున్నటువంటి వారు మాత్రమే కాకుండా నేటిజన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇలా ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…