రోజుకు ఎన్ని గంటలు అనే ప్రశ్నకు చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ 24 గంటలు అని చెబుతారు. భూ భ్రమణాన్ని బట్టి రోజుకు 24 గంటలు మాత్రమేనని ప్రజలు భావిస్తారు. అయితే ఇకపై రోజుకు 24 గంటలు అని చెప్పడం తప్పయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా తిరిగే వేగంతో పోల్చి చూస్తే భూమి దాని అక్షంపై వేగంగా తిరుగుతుండటంతో రోజులో గంటల లెక్క మారిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
మరోవైపు దశాబ్దాల నుంచి మెల్లగా తిరిగిన భూమి ఊహించని విధంగా వేగంగా తిరగడం ఖగోళ శాస్త్రవేత్తలను కంగారు పెడుతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి సూర్యుని చుట్టూ 420 సార్లు పరిభ్రమించింది. ఆ తరువాత భూమి వేగం 420 సార్ల నుంచి 410కు తగ్గింది. భూమి వేగంలో మార్పులు రావడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
భూమికి చంద్రుడు దూరంగా కదలడం, భూమిలోని సముద్రమట్టం స్థాయిలో మార్పులు, ఇతర కారణాల వల్ల భూమి భ్రమణంలో వేగం పెరిగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భూమి వేగంగా తిరగడం వల్ల తొలిసారి భూమి భ్రమణానికి నెగిటివ్ లీపు సెకను అవసరం పడిందని తెలుస్తోంది. వేగం పెరగడం వల్ల సాధారణంగా ఉండే రోజు కంటే సగటు రోజు 0.05 మిల్లీ సెకన్లు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సీనియర్ శాస్త్రవేత్త పీటర్ విబ్బర్లీ గత 50 సంవత్సరాలతో భూమి ఇప్పుడు ఎంతో వేగంగా తిరుగుతోందని కచ్చితంగా చెప్పవచ్చని తెలుపుతున్నారు. భూమి దాని అక్షంపై వేగంగా కదలడం వల్ల దేశాల సమయాలు మారతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తెలుగు సినీ చరిత్రలో అగ్ర హీరోగా నిలిచిన ఎన్టీఆర్ అనేక మంది ప్రముఖ హీరోయిన్లతో కలిసి ఎన్నో విజయవంతమైన సినిమాలు…
ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన…
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరసం తగ్గించుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఈ…
మన జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద మార్పులకు దారి తీస్తాయి. అలాంటి వాటిలో ఉదయం వేళ లేవడం ఒక…
ముఖం ఎప్పుడూ ఫ్రెష్గా, కాంతివంతంగా కనిపించడం ప్రతి ఒక్కరికీ ఇష్టం. అయితే కొన్నిసార్లు కారణం తెలియకుండానే ముఖం ఉబ్బినట్లు, ఎర్రబడినట్లు…
భారతీయ వంటింట్లో చింతపండు లేకుండా చాలా వంటలు పూర్తవవు. పులుపు రుచిని ఇచ్చే ఈ సహజ పదార్థం కేవలం రుచికే…