Allu Arjun: ఎన్టీఆర్.. బాలయ్య బాటలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఐకాన్ స్టార్!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ తర్వాత నేషనల్ వైడ్ మారుమోగుతున్న పేర్లలో అల్లుఅర్జున్ పేరు ఒకటి. పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.
వెండి తెరపై హీరోగా ఎంతోమందిని ఆకట్టుకున్న అల్లుఅర్జున్ తాజాగా సరికొత్త అవతారమెత్తి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. హీరోగా ప్రేక్షకులను మెప్పించిన ఐకాన్ స్టార్ ఇకపై హోస్ట్ గా మారనునట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్నారు. వీరి బాటలోనే అల్లు అర్జున్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా ఓటీటీ ద్వారా టాక్ షోలో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే సరికొత్త రియాలిటీ షో ద్వారా హోస్ట్ గా మారనున్నట్లు సమాచారం.
ఆహా ఓటీటీ అల్లుఅర్జున్ కుటుంబానికి చెందినది కావడంతో అల్లుఅర్జున్ కూడా రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. ఇప్పటికే యంగ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ కూడా సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…