Allu Arjun: ఎన్టీఆర్.. బాలయ్య బాటలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఐకాన్ స్టార్!
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ తర్వాత నేషనల్ వైడ్ మారుమోగుతున్న పేర్లలో అల్లుఅర్జున్ పేరు ఒకటి. పుష్ప సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు.
వెండి తెరపై హీరోగా ఎంతోమందిని ఆకట్టుకున్న అల్లుఅర్జున్ తాజాగా సరికొత్త అవతారమెత్తి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. హీరోగా ప్రేక్షకులను మెప్పించిన ఐకాన్ స్టార్ ఇకపై హోస్ట్ గా మారనునట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు బుల్లితెర వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ మంచి ఆదరణ దక్కించుకున్నారు. వీరి బాటలోనే అల్లు అర్జున్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా ఓటీటీ ద్వారా టాక్ షోలో వ్యాఖ్యాతగా ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే సరికొత్త రియాలిటీ షో ద్వారా హోస్ట్ గా మారనున్నట్లు సమాచారం.
ఆహా ఓటీటీ అల్లుఅర్జున్ కుటుంబానికి చెందినది కావడంతో అల్లుఅర్జున్ కూడా రియాలిటీ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్ అభిమానులకు పండగ అని చెప్పవచ్చు. ఇప్పటికే యంగ్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ కూడా సరికొత్త కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినబడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…