ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా మారుతున్న వేళ, టెక్ ప్రపంచాన్ని కుదిపేసే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐ పరిశోధనలో అగ్రస్థానంలో ఉన్న Anthropic తాజాగా విడుదల చేసిన కొత్త టూల్ ఇప్పుడు ఐటీ, లీగల్, ఫైనాన్స్ రంగాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ‘క్లాడ్ కోవర్క్’ పేరుతో తీసుకొచ్చిన ఈ సరికొత్త ఏఐ టూల్, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడాన్ని దాటి… మనుషులు చేసే క్లిష్టమైన వృత్తిపరమైన పనులను కూడా స్వయంగా పూర్తి చేయగలగడం విశేషం.
ఆంత్రోపిక్ ఇప్పటికే పరిచయమైన తన ‘Claude’ ఏఐ అసిస్టెంట్ను మరింత శక్తివంతంగా మార్చింది. ‘క్లాడ్ కోవర్క్’ అనే ఏజెంటిక్ టూల్తో పాటు 11 ప్రత్యేక ప్లగిన్లను విడుదల చేసింది. ఈ టూల్ వేల పేజీల న్యాయపరమైన డాక్యుమెంట్లను నిమిషాల్లో పరిశీలించి, లోపాలు, ప్రమాదకరమైన క్లాజ్లను గుర్తించగలదని కంపెనీ చెబుతోంది. కంపెనీల మధ్య జరిగే సంక్లిష్ట ఒప్పందాలను విశ్లేషించి, చట్టపరమైన రిస్క్లపై హెచ్చరికలు ఇవ్వగల సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పటివరకు జూనియర్ లాయర్లు, పారా లీగల్స్ చేసే పనులను ఇది అధిక కచ్చితత్వంతో, తక్కువ ఖర్చుతో చేస్తుండటం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
లీగల్ రంగంతో పాటు సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి విభాగాల్లో కూడా ఈ ఏఐ టూల్ పనిచేస్తుండటమే అసలు సంచలనం. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ మార్కెట్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు కంపెనీలు లీగల్ డేటా, డాక్యుమెంట్ అనాలిసిస్ కోసం Thomson Reuters, LexisNexis, Wolters Kluwer లాంటి ఖరీదైన సబ్స్క్రిప్షన్ సాఫ్ట్వేర్లపై ఆధారపడేవి. ఇప్పుడు అదే పనిని ఏఐ తక్కువ ధరకే చేస్తుండటంతో ఈ కంపెనీల భవిష్యత్తుపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రభావం భారత ఐటీ రంగానికీ తగలవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా TCS, Infosys వంటి సంస్థలు అందించే లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సేవలకు రానున్న రోజుల్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఒక్క పరిణామంతోనే ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగంలో సుమారు 285 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయిందన్న అంచనాలు సంచలనం సృష్టిస్తున్నాయి.
అయితే ఈ విమర్శలపై ఆంత్రోపిక్ స్పందించింది. తమ ఏఐ లక్ష్యం మానవ మేధస్సును భర్తీ చేయడం కాదని, నిపుణుల పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడమేనని సంస్థ స్పష్టం చేసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, Microsoft, Google వంటి దిగ్గజ సంస్థల ఏఐ టూల్స్తో పోలిస్తే, ఆంత్రోపిక్ ఏజెంట్లు వేగంగా పనులు పూర్తి చేస్తున్నాయన్న నివేదికలు రావడం. దీంతో ఏఐ రంగంలో పోటీ మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…