జనసేన పార్టీ అంతర్గత సమావేశం తాజాగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో కీలక నేతలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చగా మారిన తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై పార్టీ నేతలు స్పందించకపోవడంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
లేడీస్ డ్రెస్సులు, సినిమా వ్యాఖ్యల వంటి అంశాలపై వెంటనే స్పందించే నేతలు… కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ నిలదీశారని సమాచారం. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ను ఉద్దేశించి చేసినవిగా రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. సినిమాలకు సంబంధించిన వివాదాలపై వీడియోలు చేయడానికి సమయం దొరుకుతుందని, కానీ రాష్ట్ర ప్రజలను కదిలించిన అంశంపై మాట్లాడేందుకు సమయం లేదా అని పవన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఇదే సమావేశంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పై కూడా పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో ఎంపీగా ఉండి అందుబాటులో లేకపోవడాన్ని పవన్ తప్పుబట్టారు. వ్యక్తిగత పనులు, విదేశీ పర్యటనలకు సమయం దొరుకుతుందని, కానీ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది నేతల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పదవులు అనుభవించేందుకు కాదు, బాధ్యతగా పనిచేయడానికేనని స్పష్టంగా చెప్పిన పవన్, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే నాయకులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, బహిరంగ వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోందని, దానికి సరైన స్థాయిలో కౌంటర్ ఇవ్వడంలో జనసేన విఫలమైందని పవన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా జనసేన సోషల్ మీడియా వింగ్ మరింత చురుగ్గా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో పవన్ చూపిన ఆగ్రహం, చేసిన హెచ్చరికలు జనసేనలో క్రమశిక్షణ మరింత కఠినంగా మారబోతుందన్న సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ నేతలు ఇకపై ప్రజా అంశాలపై మరింత స్పష్టంగా, దూకుడుగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…
వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…
కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…
వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్ను ఎంపిక…