Featured

ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 11జీబీ డేటా..?

జియో ఎంట్రీతో దేశీయ టెలీకాం రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 1జీబీ డేటాకు వందల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొనగా జియో ఎంట్రీతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పోటీతత్వం వల్ల కస్టమర్లకు నాణ్యతతో కూడిన సర్వీసులు లభిస్తున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

తాజాగా ఎయిర్ టెల్ కొత్తగా ఎయిర్ టెల్ లోకి చేరే కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 4జీ సిమ్ తీసుకున్నా 4జీ సిమ్ కు అప్ గ్రేడ్ అయినా ఏకంగా 11 జీబీ డేటాను ఉచితంగా పొందే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. అయితే కేవలం పోస్ట్ పెయిడ్ యూజర్లు మాత్రమే ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం పొందడం సాధ్యమవుతుంది. రెండు విడతలో కొత్త యూజర్లు 11జీబీ డేటాను పొందగలుగుతారు.

కొత్తగా ఎయిర్ టెల్ 4జీ సిమ్ తీసుకున్న కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా 5జీ డేటా వస్తుంది. ఐదు 1జీబీ డేటా కూపన్ల రూపంలో యాప్ లో ఈ డేటా క్రెడిట్ అవుతుంది. యాప్ లో క్రెడిట్ అయిన మూడు నెలల్లో ఈ డేటాను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకపోతే మాత్రం 2జీబీ డేటాను మాత్రమే పొందడం సాధ్యమవుతుంది.

ఈ ఆఫర్ తో పాటు ఎయిర్ టెల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ కస్టమర్లు 598 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజీలతో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ డేటా ఉచితంగా పొందే ఛాన్స్ ఉంటుంది. రూ.399 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే నాలుగు కూపన్లు, రూ.219తో రీచార్జీ చేసుకుంటే రెండు కూపన్లు లభిస్తాయి. అయితే ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ తో రీచార్జీ చేసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తగా 4జీ కనెక్షన్ తీసుకుని 598 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్ ను రీఛార్జీ చేసుకుంటే 11జీబీ డేటా పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

18 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

20 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago