Featured

ఎయిర్ టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 11జీబీ డేటా..?

జియో ఎంట్రీతో దేశీయ టెలీకాం రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. గతంలో 1జీబీ డేటాకు వందల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొనగా జియో ఎంట్రీతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పోటీతత్వం వల్ల కస్టమర్లకు నాణ్యతతో కూడిన సర్వీసులు లభిస్తున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఆఫర్లను ప్రకటిస్తూ యూజర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

తాజాగా ఎయిర్ టెల్ కొత్తగా ఎయిర్ టెల్ లోకి చేరే కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. 4జీ సిమ్ తీసుకున్నా 4జీ సిమ్ కు అప్ గ్రేడ్ అయినా ఏకంగా 11 జీబీ డేటాను ఉచితంగా పొందే అవకాశాన్ని ఎయిర్ టెల్ కల్పిస్తోంది. అయితే కేవలం పోస్ట్ పెయిడ్ యూజర్లు మాత్రమే ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం పొందడం సాధ్యమవుతుంది. రెండు విడతలో కొత్త యూజర్లు 11జీబీ డేటాను పొందగలుగుతారు.

కొత్తగా ఎయిర్ టెల్ 4జీ సిమ్ తీసుకున్న కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా 5జీ డేటా వస్తుంది. ఐదు 1జీబీ డేటా కూపన్ల రూపంలో యాప్ లో ఈ డేటా క్రెడిట్ అవుతుంది. యాప్ లో క్రెడిట్ అయిన మూడు నెలల్లో ఈ డేటాను రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కస్టమర్లు ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకపోతే మాత్రం 2జీబీ డేటాను మాత్రమే పొందడం సాధ్యమవుతుంది.

ఈ ఆఫర్ తో పాటు ఎయిర్ టెల్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్ కస్టమర్లు 598 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజీలతో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ డేటా ఉచితంగా పొందే ఛాన్స్ ఉంటుంది. రూ.399 కంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకుంటే నాలుగు కూపన్లు, రూ.219తో రీచార్జీ చేసుకుంటే రెండు కూపన్లు లభిస్తాయి. అయితే ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ తో రీచార్జీ చేసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. కొత్తగా 4జీ కనెక్షన్ తీసుకుని 598 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు గల ప్లాన్ ను రీఛార్జీ చేసుకుంటే 11జీబీ డేటా పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago