Aishwarya – Abhishek: బాలీవుడ్ ఇండస్ట్రీలో చూడ ముచ్చటగా కనిపించే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ గురించి తెలియని వారంటూ ఉండరు. 2007లో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2011లో వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అయితే అందరి సెలబ్రిటీల లాగే వీరి వివాహ బంధం గురించి అనేక రూమర్లు వినిపించాయి. 2014లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా మరొకసారి ఐశ్వర్య – అభిషేక్ విడాకులు వార్త వైరల్ గా మారింది. అయితే ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవ్వటానికి కారణాలు లేకపోలేదు. వివాహం తర్వాత ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ ఎక్కడికి వెళ్లినా జంటగా కలిసి వెళ్లేవారు. కానీ గత కొంతకాలంగా ఐశ్వర్య అభిషేక్ జంటగా ఏ కార్యక్రమానికి వెళ్లిన సందర్భాలు లేవు. ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒంటరిగా అన్ని కార్యక్రమాలకు హాజరవుతుంది. ఇటీవల నిర్వహించిన మిగతా అంబానీ కల్చరల్ ఈవెంట్లో కూడా ఐశ్వర్య కూతురితో పాటు హాజరయ్యింది.
మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీలు జంటలుగా హాజరైతే ఐశ్వర్య మాత్రం కూతురితో కలిసి ఒంటరిగా ఈ ఈవెంట్ కి హాజరు అయ్యింది. దీంతో ఐశ్వర్య – అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు మరొక సారి చక్కర్లు కొడుతున్నాయి.
ఐశ్వర్య, అభిషేక్ మధ్య మనస్పర్ధలు రావడంతో గత కొంతకాలంగా ఐశ్వర్య కూతురితో కలిసి అభిషేక్ కి దూరంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఎక్కడికి వెళ్ళినా కూడా అభిషేక్ తోడుగా లేకుండా ఐశ్వర్య కూతురుతో కలిసి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విడాకుల వార్తలపై ఈ సెలబ్రిటీ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. గతంలో వచ్చిన విడాకుల వార్తల గురించి అభిషేక్ స్పందిస్తూ.. “నేను విడాకులు తీసుకుంటున్నట్లు నాకు గుర్తు చేసినందుకు థాంక్స్.. నా రెండవ పెళ్లి కూడా ఎప్పుడు చేస్తున్నారో మీరే చెప్పండి” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు వస్తున్న ఈ వార్తలపై అభిషేక్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…