Ajay Ghosh : 2010వ సంవత్సరంలో విడుదల అయిన ‘ప్రస్థానం’ సినిమా ద్వారా సినిమాలకు పరిచయం అయ్యాడు అజయ్ ఘోష్. తరువాత రన్ రాజా రన్, జ్యోతి లక్ష్మి, బహుబలి 2, భాగమతి, రంగస్థలం వంటి సినిమాలలో నటించి అభిమానులకు చేరువ అయ్యారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని ‘కొండా రెడ్డి’ పాత్రతో ఆకట్టుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అజయ్ ఘోష్ అలరించాడు. అయితే తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తనకు సంబందించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అమ్మాయిల గొంతుతో అర్ధరాత్రి ఫోన్ చేస్తారు…
ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన గుండు గురించి ప్రస్తావించగా, మా పెద్దబ్బాయి జతలో ఇంగ్లీష్ సినిమాలు చూసి నాకంటూ కూడా ఒక ప్రత్యేకత ఉండాలని చేయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక సెట్ లో అయినా ఎక్కడైనా నేను ఒకేలాగే ఉంటానని, అలానే ఉన్నా కూడా నాకంటూ ఆప్యాయ్యంగా పలకరించే వారు ఉన్నారని చెప్పారు. సునీల్, ప్రవీణ్, ధన్ రాజ్ లాంటి వాళ్ళు నాతో సన్నిహితంగా ఉంటారని, ధన్ రాజ్, ప్రవీణ్ ఏకంగా అర్ధరాత్రి నాకు అమ్మాయి గొంతుతో ఫోన్ చేసి ఆటపాట్టిస్తారని చెప్పుకొచ్చారు.
ఇక కోటా శ్రీనివాస రావు గారు అంటే మీకెందుకు అంత అభిమానం అన్న ప్రశ్నకు.. నా దృష్టిలో ఆయన ఒక లెజెండ్ అని చెప్పారు. ఏదైనా పాత్ర చేస్తే కోటా శ్రీనివాసరావు గారు కనిపించరు, ఆ పాత్ర మాత్రమే మనకు కనిపిస్తుంది. నటనలో అయన నీడను నేను చేరుకున్నా, నేను చాలా గొప్ప నటుడు అయ్యాను అని భావిస్తాను. ఆయనను చూసి నేను చాలా ప్రభావితున్ని అయ్యాను. అని కోటా మీద తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చారు. అజయ్ ఘోష్ తెలుగు తో పాటు తమిళ్, కన్నడ సినిమాలలో కూడా నటించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…