Akkineni Nagarjuna: బిగ్ బాస్ కార్యక్రమం నాగార్జునకు రోజుకు ఒక కొత్త తలనొప్పిని తీసుకొస్తుంది. ఈయన ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం పట్ల చాలామంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ పెద్ద ఎత్తున నాగార్జునను తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో బిగ్ బాస్ కార్యక్రమాన్ని విమర్శించిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఇలాంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జునని కూడా తప్పుపట్టారు.
ఈ విధంగా బిగ్ బాస్ కార్యక్రమం పట్ల విమర్శలు చేయడమే కాకుండా ఇలాంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి ఏం తెలియచేస్తారు అంటూ ప్రశ్నించారు. ఇలా నారాయణ తర్వాత మరొక సీనియర్ నిర్మాత చిట్టిబాబు బిగ్ బాస్ కార్యక్రమం పై మండిపడ్డారు.ఈ సందర్భంగా నారాయణ బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఇది బిగ్ బాస్ కార్యక్రమం కాదని బ్రోతల్ హౌస్ అంటూ కామెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈయన వ్యాఖ్యలపై త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ ఆయన భాష తప్పయి ఉండవచ్చు.. కానీ భావం మాత్రం అదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా నాలుగు గోడల మధ్య రొమాన్స్ ను ప్రోత్సహిస్తారా ఇవి పబ్లిక్ రొమాన్స్ కంటే వ్యభిచారం కంటే దారుణం అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
సినిమాలలో నటీనటుల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో బిగ్ బాస్ కార్యక్రమం కూడా అంతేనని వాళ్ళకి బయట వాళ్ళు కనిపించకపోయినా వందల కెమెరాలు వారిని చూస్తుంటాయని,వాళ్లను బిగ్ బాస్ నిర్వాహకులు పసిగడుతూనే ఉంటారు అలాంటప్పుడు అది రొమాన్స్ ఎలా అవుతుంది అంటూ ఈయన ప్రశ్నించారు.ఇలా నిత్యం ఎవరో ఒకరు బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడంతో నాగార్జున మాత్రం పీకల్లోతో ఈ వివాదాలను ఎదుర్కొంటూ ఉన్నారు.అయినా ఇలాంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం అవసరమా అంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…