Movie News

Alekhya Reddy: తారకరత్నను తలుచుకొని ఎమోషనల్ అయినా అలేఖ్య రెడ్డి… ఆనంద సమయంలో మీరు లేరంటూ?

Alekhya Reddy: నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు హాస్పిటల్లో మరణంతో పోరాడుతూ చివరికి మృతి కౌగిలిలో బంధి అయిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన ఫిబ్రవరి 18వ తేదీ మరణించిన సంగతి తెలిసిందే. అయితే తారకరత్న మరణించి ఇన్ని నెలలు అవుతున్న తన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఈ బాధ నుంచి బయటపడలేదు.

తరచూ ఈమె తన భర్తను తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఇలా తారకరత్న మరణించిన సమయంలో అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ప్రేమించిన వాడిని కుటుంబ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని తనతో పాటు వచ్చినటువంటి అలేఖ్య రెడ్డికి తారకరత్న దూరం అవడంతో ఈ నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

ఇలా తరచూ తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రేమను గుర్తు చేసుకుంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తూనే ఉన్నారు అయితే నేడు మరోసారి తారకరత్నను తలుచుకొని ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది ఇకపోతే నేడు తారకరత్న కవల పిల్లలు అయినటువంటి తాన్యారామ్ , రేయా ల పుట్టినరోజు. దీంతో బాగోద్వేగమైన ఒక పోస్టును షేర్ చేశారు.

Alekhya Reddy: ఇంద్రధనస్సు కంటే నువ్వే అందంగా ఉంటావు…


ముందుగా తన పెద్ద కుమార్తె తన తండ్రికి పువ్వులు పెడుతుండగా ఇద్దరు చిన్నారులు తనకు సహాయం చేస్తూ ఉన్నటువంటి ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఆనంద సమయంలో మీరు మాతో లేరు కానీ పిల్లల ముఖంలో నువ్వు ఎప్పుడూ ఉంటావు. వర్షం కురిసే రోజు ఇంద్రధనస్సు కంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు. ప్రొద్దుతిరుగుడు పువ్వు కంటే ఉత్సాహంగా ఉన్నావు.. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము.. మా ఆనందాన్ని రెట్టింపు చేయాలని, ప్రేమను పెట్టింపు చేయాలని కోరుకుంటున్నాము. అద్భుతమైన మన కవలలకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఈ సందర్భంగా అలేఖ్య రెడ్డి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago