Political News

ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చినెల చివరి వారం జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని భావిస్తున్నారు. అన్ని పార్టీల నుంచి అభిప్రాయం కోరి ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 28వ తేదీన ఎన్నికల కమిషనర్ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించన్నారు.

విజయవాడ నగరంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీలతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వంతో పూర్తిస్థాయిలో చర్చించిన తరువాత ఎన్నికల విషయంలో అడుగులు ముందుకు పడనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే నిధులు విడుదల అయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ గతంలో ఎన్నికలను వాయిదా వేయడంతో జగన్ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించింది.

ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించి ఎన్నికల కమిషనర్ గా నియమించబడ్డారు. ఈ నెల 28వ తేదీన జరగబోయే మీటింగ్ తరువాత ఎన్నికల నిర్వహణ తేదీలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సహకారం అందేలా ఆదేశాలు జారీ చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్ విచారణ సమయంలో ప్రభుత్వ తరపు లాయర్ ఎన్నికల కమిషన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కోరలేదని వెల్లడించారు. ఇదే సమయంలో ప్రభుత్వ తరపు న్యాయవాది నిమ్మగడ్డ రమేష్ కు హైదరాబాద్ లో సైతం అధికార నివాసం ఉన్నట్టు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్‌లో అధికార నివాసం, విజయవాడలో మరో నివాసం ప్రభుత్వ ధనం వృథా అవుతుందని వ్యాఖ్యానించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

3 days ago