దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీ తాజాగా మరో కొత్త పాలసీని వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. జీవన్ శాంతి పేరుతో ఎల్ఐసీ నూతన పాలసీని ఆవిష్కరించింది. జీవన్ శాంతి పాలసీ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్. ఇది ఇండివిజువల్ సింగిల్ ప్రీమియం ప్లాన్ కావడం గమనార్హం.
యాన్యుటీ రేట్లను జీవన్ శాంతి పాలసీని తీసుకునే సమయంలోనే నిర్ణయించుకోవచ్చు. ఈ పాలసీ ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకారం పాలసీ డబ్బులు వస్తాయి. మనం పాలసీ తీసుకున్న తరువాత ఎన్ని సంవత్సరాల నుంచి డబ్బులను పొందాలో ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్ లైన్ లోనే పాలసీలను కొనుగోలు చేయవచ్చు.
జాయింట్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్, సింగిల్ లైఫ్ యాన్యుటీ ఆప్షన్ లతో ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఒక ఆప్షన్ ను ఎంపిక చేసుకుని మనం సులువుగా డబ్బు పొందవచ్చు. పాలసీ తీసుకున్న తరువాత ఏ కారణం చేతనైనా పాలసీదారుడు మరణిస్తే నామినీ డెత్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయి. కనీసం లక్షన్నర రూపాయలతో ఈ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది.
30 సంవత్సరాల నుంచి 79 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీకి అర్హులు. నెల, 3 నెలలు, ఆరు నెలలు, 12 నెలల చొప్పున యాన్యుటీని పొందే అవకాశం ఉంటుంది. 5.5 శాతం రాబడితో ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ఎవరైనా 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి పాలసీని తీసుకుంటే యాన్యుటీ రేటు పెరుగుతుంది. సంవత్సరానికి కనీసం 12,000 రూపాయలు యాన్యుటీ లభించే ఈ పాలసీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…