Allu Aravind: తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయ మెరుగని దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ఆస్కార్ అవార్డును కూడా అందుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ సినిమా ఆస్కార్ అవార్డును అందుకోవడంతో తెలుగు సినిమా నిర్మాత మండలి చిత్ర బృందాన్ని ఘనంగా సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సినిమా గురించి ఈ సినిమాలో నటీనటుల గురించి పలు విషయాలను తెలియచేశారు. ఆస్కార్ అవార్డు మనకు అందని ద్రాక్ష వంటిదే.అయితే తాను గత కొన్ని సంవత్సరాల క్రితం డబ్బు పెట్టి మరి ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లానని అక్కడ వారందరిని చూసి చాలా సంతోషపడ్డానని తెలిపారు.
ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై రాజమౌళి అండ్ టీం ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. రాజమౌళి చంద్రబోస్ కీరవాణి నా మేనల్లుడు రామ్ చరణ్, లవ్లీ హీరో ఎన్టీఆర్ ఇలా వీరందరిని ఆస్కార్ వేదికపై చూస్తే నా కడుపు నిండిపోయింది. ఇక కీరవాణి గారితో నాకు క్షణక్షణం సినిమా నుంచి మంచి అనుబంధము ఉందని తెలిపారు.
తాను రాజమౌళి దర్శకత్వంలో నిర్మాతగా మగధీర సినిమాను చేశాను.ఇకపై రాజమౌళి దర్శకత్వంలో తాను ఫలానా సినిమా చేశాను అని చాలా గర్వంగా చెప్పుకుంటాను అంటూ ఈ సందర్భంగా రాజమౌళి గురించి అల్లు అరవింద్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో నటించిన హీరోలను రామ్ చరణ్ నా మేనల్లుడు అని ఎన్టీఆర్ ను లవబుల్ హీరో అంటూ సంబోధించడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…