Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి.ఒకప్పుడు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే నిర్మించే ఈ సమస్థలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించే స్థాయికి ఎదిగాయి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలలో అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.
అల్లు రామలింగయ్య హాస్యనటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించారు.ఇక ఈ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక అల్లు కుటుంబంలో గీత అనే పేరు గల వ్యక్తులు ఎవరూ లేరు. అయితే ఈ బ్యానర్ కు గీత అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఈ పేరు వెనుక కథ ఏంటి అనే విషయాలను తాజాగా అల్లు అరవింద్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తెలియజేశారు.
ఈ క్రమంలోనే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ.. ఈ పేరును తన తండ్రి అల్లు రామలింగయ్య పెట్టారని తెలియజేశారు. భగవద్గీత సారాంశం నచ్చడం వల్లే నాన్న ఈ పేరు పెట్టారని అల్లు అరవింద్ తెలియజేశారు.ప్రయత్నం మాత్రమే మనది ఫలితం మన చేతుల్లో ఉండదు. ఇది సినిమాలకు కరెక్ట్ గా సరిపోతుంది కేవలం సినిమాలను నిర్మించడం వరకే మన పని ఆ ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది ఈ సారాంశం కరెక్టుగా సరిపోతుందన్న ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే అలీ కలుగజేసుకొని పెళ్లయిన తర్వాత నిర్మల ఆర్ట్స్ అని పెట్టొచ్చు కదా అంటూ ప్రశ్నించగా… గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి అందుకే పేరు మార్చాలన్న ఆలోచన కూడా రాలేదని అల్లు అరవింద్ తెలిపారు.మరొక విషయం గురించి చెబుతూ కాలేజీ రోజుల్లో గీత అనే గర్ల్ ఫ్రెండ్ కూడా తనకు ఉండేది అంటూ సరదాగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…