Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి.ఒకప్పుడు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే నిర్మించే ఈ సమస్థలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించే స్థాయికి ఎదిగాయి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలలో అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.
అల్లు రామలింగయ్య హాస్యనటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించారు.ఇక ఈ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక అల్లు కుటుంబంలో గీత అనే పేరు గల వ్యక్తులు ఎవరూ లేరు. అయితే ఈ బ్యానర్ కు గీత అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఈ పేరు వెనుక కథ ఏంటి అనే విషయాలను తాజాగా అల్లు అరవింద్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తెలియజేశారు.
ఈ క్రమంలోనే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ.. ఈ పేరును తన తండ్రి అల్లు రామలింగయ్య పెట్టారని తెలియజేశారు. భగవద్గీత సారాంశం నచ్చడం వల్లే నాన్న ఈ పేరు పెట్టారని అల్లు అరవింద్ తెలియజేశారు.ప్రయత్నం మాత్రమే మనది ఫలితం మన చేతుల్లో ఉండదు. ఇది సినిమాలకు కరెక్ట్ గా సరిపోతుంది కేవలం సినిమాలను నిర్మించడం వరకే మన పని ఆ ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది ఈ సారాంశం కరెక్టుగా సరిపోతుందన్న ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే అలీ కలుగజేసుకొని పెళ్లయిన తర్వాత నిర్మల ఆర్ట్స్ అని పెట్టొచ్చు కదా అంటూ ప్రశ్నించగా… గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి అందుకే పేరు మార్చాలన్న ఆలోచన కూడా రాలేదని అల్లు అరవింద్ తెలిపారు.మరొక విషయం గురించి చెబుతూ కాలేజీ రోజుల్లో గీత అనే గర్ల్ ఫ్రెండ్ కూడా తనకు ఉండేది అంటూ సరదాగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…