Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్దపెద్ద నిర్మాణ సంస్థలు ఉన్నాయి.ఒకప్పుడు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే నిర్మించే ఈ సమస్థలు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను కూడా నిర్మించే స్థాయికి ఎదిగాయి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నిర్మాణ సంస్థలలో అల్లు అరవింద్ స్థాపించిన గీతా ఆర్ట్స్ బ్యానర్ ఒకటి.
అల్లు రామలింగయ్య హాస్యనటుడుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే గీతా ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించారు.ఇక ఈ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక అల్లు కుటుంబంలో గీత అనే పేరు గల వ్యక్తులు ఎవరూ లేరు. అయితే ఈ బ్యానర్ కు గీత అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటి ఈ పేరు వెనుక కథ ఏంటి అనే విషయాలను తాజాగా అల్లు అరవింద్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తెలియజేశారు.
ఈ క్రమంలోనే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ గురించి మాట్లాడుతూ.. ఈ పేరును తన తండ్రి అల్లు రామలింగయ్య పెట్టారని తెలియజేశారు. భగవద్గీత సారాంశం నచ్చడం వల్లే నాన్న ఈ పేరు పెట్టారని అల్లు అరవింద్ తెలియజేశారు.ప్రయత్నం మాత్రమే మనది ఫలితం మన చేతుల్లో ఉండదు. ఇది సినిమాలకు కరెక్ట్ గా సరిపోతుంది కేవలం సినిమాలను నిర్మించడం వరకే మన పని ఆ ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుంది ఈ సారాంశం కరెక్టుగా సరిపోతుందన్న ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
ఈ క్రమంలోనే అలీ కలుగజేసుకొని పెళ్లయిన తర్వాత నిర్మల ఆర్ట్స్ అని పెట్టొచ్చు కదా అంటూ ప్రశ్నించగా… గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఎన్నో సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి అందుకే పేరు మార్చాలన్న ఆలోచన కూడా రాలేదని అల్లు అరవింద్ తెలిపారు.మరొక విషయం గురించి చెబుతూ కాలేజీ రోజుల్లో గీత అనే గర్ల్ ఫ్రెండ్ కూడా తనకు ఉండేది అంటూ సరదాగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…