Senior Actor Narasimharaju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, ఇక సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.
వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినడానికి కారణాలు అవే…
నరసింహారాజు గారు మంచి హిట్ సినిమాల్లో నటించినా జానపద హీరోగా సక్సెస్ అయినట్లు సాంఘిక చిత్రల్లో పెద్దగా హిట్లు కొట్టలేదు. ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కూడా ఒక్కోసారి లేట్ అవుతుంటుంది అందుకే ఆయన హీరోగా ఎక్కువకాలం చేయలేకపోయారు. ఇక అందరి నటులతోను స్నేహంగా ఉండే నరసింహారాజు గారు కత్తి పట్టి సినిమాల్లో కనిపించిన వాళ్లంతా ఆర్థికంగా చితికిపోయారు అనే వాదనను తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని సినిమాలు చేసినప్పుడు వచ్చే డబ్బు అదే సినిమాలో పెట్టుబడిగా పెడితే పోతుంది. కాంతారావు గారు, సావిత్రి గారు అలానే పోగొట్టుకున్నారు.
కొన్నిసినిమాలను స్వయంగా నిర్మించడం వల్ల సినిమాలు పోయాయి వాటితో ఆస్తులను కొంతవరకు పోగొట్టుకున్నారు. కాంతారావు గారు అలానే చెన్నై లో తనకు ఉన్న పెద్ద భవనాలను అమ్మి అప్పుతీర్చారు. ఇక మేము రాజులం అవడంతో నాన్న గారు దాన ధర్మాలను ఎక్కువ చేసేవారు అలా ఆస్తులు పోయాయి. ఇక అప్పులను చేయడం వల్ల నేను సినిమాల్లోకి వచ్చాక కొంతవరకు తీర్చాను. అలా కాకుండా డబ్బు ఆస్తులు చేయడానికి వాడుంటే ఇప్పుడు ఇంకా బాగా సంపాదించుండేవాడిని. అదీకాక వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల ఆస్తులు చేసుకోలేదు. ఆర్థికంగా ఒక దశలో బాగా ఇబ్బందులు పడ్డాను అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…