Senior Actor Narasimharaju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, ఇక సినిమాల మీద మక్కువతో నరసింహారాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. ‘నీడలేని ఆడది’ వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహరాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.
వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినడానికి కారణాలు అవే…
నరసింహారాజు గారు మంచి హిట్ సినిమాల్లో నటించినా జానపద హీరోగా సక్సెస్ అయినట్లు సాంఘిక చిత్రల్లో పెద్దగా హిట్లు కొట్టలేదు. ఇక సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కూడా ఒక్కోసారి లేట్ అవుతుంటుంది అందుకే ఆయన హీరోగా ఎక్కువకాలం చేయలేకపోయారు. ఇక అందరి నటులతోను స్నేహంగా ఉండే నరసింహారాజు గారు కత్తి పట్టి సినిమాల్లో కనిపించిన వాళ్లంతా ఆర్థికంగా చితికిపోయారు అనే వాదనను తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని సినిమాలు చేసినప్పుడు వచ్చే డబ్బు అదే సినిమాలో పెట్టుబడిగా పెడితే పోతుంది. కాంతారావు గారు, సావిత్రి గారు అలానే పోగొట్టుకున్నారు.
కొన్నిసినిమాలను స్వయంగా నిర్మించడం వల్ల సినిమాలు పోయాయి వాటితో ఆస్తులను కొంతవరకు పోగొట్టుకున్నారు. కాంతారావు గారు అలానే చెన్నై లో తనకు ఉన్న పెద్ద భవనాలను అమ్మి అప్పుతీర్చారు. ఇక మేము రాజులం అవడంతో నాన్న గారు దాన ధర్మాలను ఎక్కువ చేసేవారు అలా ఆస్తులు పోయాయి. ఇక అప్పులను చేయడం వల్ల నేను సినిమాల్లోకి వచ్చాక కొంతవరకు తీర్చాను. అలా కాకుండా డబ్బు ఆస్తులు చేయడానికి వాడుంటే ఇప్పుడు ఇంకా బాగా సంపాదించుండేవాడిని. అదీకాక వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ పెట్టడం వల్ల ఆస్తులు చేసుకోలేదు. ఆర్థికంగా ఒక దశలో బాగా ఇబ్బందులు పడ్డాను అంటూ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…