Movie News

Allu Arjun: ఆ విషయంలో ప్రభాస్ ను మించిపోయిన అల్లు అర్జున్?

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ప్రభాస్. బాహుబలి సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ లో బిజీగా ఉండడమే కాకుండా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందారు.

ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా ప్రభాస్ కి ఇప్పటివరకు పోటీ లేదనే చెప్పాలి. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోగా ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నారు. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా-2024 ప్రకారం అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ హీరోల జాబితాను విడుదల చేసింది.

ఈ జాబితాలో భాగంగా అల్లు అర్జున్ ఇండియాలోనే అత్యధికంగా రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి హీరోగా మొదటి స్థానంలో ఉన్నారు.పుష్ప 2: ది రూల్ సినిమా కోసం ఆయన రూ.300కోట్లు పారితోషికం అందుకున్నట్టు ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఈవార్త సంచలనం రేపుతోంది. ఇక అల్లు అర్జున్ తర్వాత తమిళ నటుడు విజయ్ తలపతి ఉన్నారు.

Allu Arjun: ఆరో స్థానంలో ప్రభాస్..

విజయ్ 130-175కోట్లు, షారుఖ్ 150-250కోట్లు, రజినీకాంత్ 150-270కోట్లు, అమీర్ ఖాన్ 100-275కోట్లు, ప్రభాస్ 100-200కోట్లు, అజిత్ 105-165కోట్లు, సల్మాన్ 100-150కోట్లు, కమల్ హాసన్ 100-150కోట్లు, అక్షయ్ కుమార్ 60-145కోట్లు.. తర్వాతి స్థానాల్లో నిలిచారని ఫోర్బ్స్ కథనం ప్రచురించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

23 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

23 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

23 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

24 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

24 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

24 hours ago