భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. బయోపిక్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా లో రుద్రమదేవి పాత్ర లో అనుష్క నటించింది.. మిగిలిన తారాగణం కూడా పెద్ద పెద్ద నటులే నటించడం విశేషం.. రానా ఈ సినిమా లో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో వచ్చే అతిముఖ్యమైన పాత్ర గోన గన్నారెడ్డి.. ఈ పాత్ర ను అల్లు అర్జున్ చేసి మెప్పించాడు. ఈ పాత్రకు అయన చెప్పే డైలాగ్స్ కి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.. థియేటర్లో గోలలు, విజిల్స్ పడ్డాయి.
తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా.. ఆడా ఉంటా అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. పలు భాషల్లోకి అనువాదం అయిన ఈ చిత్రం అక్కడ కూడా మంచి కలెక్షన్లు సాధించి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి గోనగన్నారెడ్డి పాత్ర అని చెప్పాలి. అల్లు అర్జున్ చేసినందువల్లనే ఈ పాత్ర బాగా పండింది.. అయితే గుణశేఖర్ ఈ పాత్ర కి ముందుగా అల్లు అర్జున్ ని అనుకోలేదట.. గోనా గన్నారెడ్డి పాత్ర చేయ డానికి మహేష్ బాబుతో పాటు ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి చూపించారట. వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలించలేక వాళ్లు ఈ క్యారెక్టర్ చేయలేకపోయారు. ఆ తర్వాత గోన గన్నారెడ్డి రెడ్డి అల్లు అర్జున్ను వరించినట్టు గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.
ఇకపోతే గుణశేఖర్ ఈ సినిమా తర్వాత చాల గ్యాప్ తీసుకుని మరొక హిస్టారికల్ సినిమా శాకుంతలం ని చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత తొలిసారి పౌరాణిక పాత్రైన శకుంతలగా నటిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. కథలో కీలకమైన దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబును అనుకుంటున్నారు. ఈ సోమవారమే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…