ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప చిత్రంతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కాస్త విరామం దొరకడంతో తన ఫ్యామిలీతో కలిసి ఇటీవలే మాల్దీవులలో ఎంజాయ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ హైదరాబాద్ రోడ్లపై ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే తన కూతురు అల్లు అర్హ, భార్య స్నేహ రెడ్డి ని తీసుకుని లాంగ్ డ్రైవ్ కి వెళ్లారు.
అల్లుఅర్జున్ స్వయంగా కారు నడుపుతుండగా, అల్లు అర్హ మొబైల్స్ లో గేమ్ ఆడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని స్నేహ రెడ్డి చేసి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అఖిల్ లేటెస్ట్ మూవీ అయినా మోస్ట్ ఎలిజిబుల్ సినిమా లోని బుజ్జి గులాబి లాగా సాంగ్ వినిపిస్తోంది.ఈ వీడియో ని బట్టి చూస్తే అల్లు అర్జున్ వింటూ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అల్లు అరవింద్, బన్నీ వాసు కలిసి నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ సినిమా దీక్షకు నుంచి మంచి ఆదరణ పొందుతోంది. అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో భాగంగానే ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి దశకు చేరుకుంది.
ఈ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా నటుడు ఫాహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అల్లు అర్జున్ కి రష్మిక మందన నటిస్తోంది. ఈసినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో ఎక్కువగా అడవి నేపథ్యంలోనే జరుగుతోంది. ఇందులో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ,భాషలలో ఈ సందర్భంగా డిసెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…