Amalapaul: డస్కీ బ్యూటీ అమలాపాల్ రెండు నెలల క్రితం ప్రేమించిన వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు అయితే గోవాకు చెందినటువంటి ప్రముఖ బిజినెస్ మెన్ జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ఈమె నవంబర్ 5వ తేదీ రెండో వివాహం చేసుకున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.
అక్టోబర్ చివరి వారంలో తన ప్రియుడిని పరిచయం చేసి నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈమె నవంబర్ 5వ తేదీ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పెళ్లి తర్వాత రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని రివీల్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మా జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అనే విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ అమలాపాల్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మూడో వ్యక్తి రాబోతున్నారు..
ఇలా ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా మరికొంతమంది ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నవంబర్ 5వ తేదీ పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లి జరిగి కూడా రెండు నెలలు పూర్తి కాలేదు అప్పుడే ప్రెగ్నెన్సీ ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…