Amalapaul: డస్కీ బ్యూటీ అమలాపాల్ రెండు నెలల క్రితం ప్రేమించిన వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇదివరకే తమిళ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు అయితే గోవాకు చెందినటువంటి ప్రముఖ బిజినెస్ మెన్ జగత్ దేశాయ్ అనే వ్యక్తిని ఈమె నవంబర్ 5వ తేదీ రెండో వివాహం చేసుకున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది.
అక్టోబర్ చివరి వారంలో తన ప్రియుడిని పరిచయం చేసి నిశ్చితార్థం చేసుకున్నటువంటి ఈమె నవంబర్ 5వ తేదీ పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే పెళ్లి తర్వాత రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈమె తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని రివీల్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మా జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నారు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు త్రీ అనే విషయాన్ని నేను ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ అమలాపాల్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
మూడో వ్యక్తి రాబోతున్నారు..
ఇలా ఈమె తన ప్రెగ్నెన్సీ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది ఈమెకు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా మరికొంతమంది ఈమె ప్రెగ్నెన్సీ గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నవంబర్ 5వ తేదీ పెళ్లి చేసుకున్నటువంటి ఈమె పెళ్లి జరిగి కూడా రెండు నెలలు పూర్తి కాలేదు అప్పుడే ప్రెగ్నెన్సీ ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…