Jabardasth: జబర్దస్త్ బూతుల షో.. రామోజీరావు వద్దని చెప్పారు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?
Ramgopal Varam: రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటూ నిత్యం సంచలన వ్యాఖ్యలు ద్వారా వార్తల్లో నిలిచే వర్మ చిన్న కామెంట్ చేసిన, లేదా సినిమా చేసినా కూడా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఒకప్పుడు ఎన్నో కమర్షియల్ చిత్రాలు తీస్తూ టాప్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వర్మ బయోపిక్ చిత్రాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే వర్మ ఎంతోమంది రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొండా మురళి సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా వర్మ కొండా అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్రబృందం పలు ప్రాంతాలలో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా రామ్ గోపాల్ వర్మ వేదికపై మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున ఈలలు కేకలు వేస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే కొండ మురళి మైక్ చేతపట్టుకొని వర్మ చెబితే అమితాబచ్చన్ కూడా వింటారు. ఈ మధ్య కాలంలో కొండ మురళి చెప్పేది కూడా వింటున్నారు. ఇప్పుడు ఆయన మాటలు మీరు కూడా వినాలి అంటూ చెప్పారు.
కొండా మురళి ఈ విధంగా వర్మ గురించి చెప్పడంతో మైక్ అందుకున్న వర్మ అమితాబచ్చన్ రియల్ హీరో కాబట్టి వర్మ చెప్పేది వింటాడు. కొండ మురళి రియల్ హీరో కనుక ఆయన చెప్పేది వినాలి అంటూ వర్మ కామెంట్ చేశారు. ఈ విధంగా అమితాబచ్చన్ రీల్ హీరో, కొండ మురళి రియల్ హీరో అంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక కొండ మురళి దంపతులు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వయంగా కొండా మురళి సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…