ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ లో భాగంగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. 9వ తరగతి, ఆపై తరగతులు చదివే విద్యార్థులు అమ్మఒడి స్కీమ్ ద్వారా ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ల్యాప్ టాప్ ల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ల్యాప్ టాప్ లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం తెచ్చే ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుందని ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలుస్తున్న సమాచారం ప్రకారం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే ఈ ల్యాప్ టాప్ లో 4జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్ ఉంటుందని తెలుస్తోంది. నేటి కంప్యూటర్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్ లో ఈ ల్యాప్ టాప్ ల ధర 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయల మధ్య ఉంటుంది.
అయితే ప్రభుత్వం ఈ ల్యాప్ టాప్ లను కేవలం 18,500 రూపాయలకే అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ డిగ్రీ విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ లు అందించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ల్యాప్ టాప్ ల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. తక్కువ ధరకే ల్యాప్ టాప్ లు లభిస్తూ ఉండటం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…