ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ లో భాగంగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. 9వ తరగతి, ఆపై తరగతులు చదివే విద్యార్థులు అమ్మఒడి స్కీమ్ ద్వారా ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ల్యాప్ టాప్ ల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ల్యాప్ టాప్ లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం తెచ్చే ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుందని ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలుస్తున్న సమాచారం ప్రకారం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే ఈ ల్యాప్ టాప్ లో 4జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్ ఉంటుందని తెలుస్తోంది. నేటి కంప్యూటర్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్ లో ఈ ల్యాప్ టాప్ ల ధర 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయల మధ్య ఉంటుంది.
అయితే ప్రభుత్వం ఈ ల్యాప్ టాప్ లను కేవలం 18,500 రూపాయలకే అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ డిగ్రీ విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ లు అందించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ల్యాప్ టాప్ ల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. తక్కువ ధరకే ల్యాప్ టాప్ లు లభిస్తూ ఉండటం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…