ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ లో భాగంగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. 9వ తరగతి, ఆపై తరగతులు చదివే విద్యార్థులు అమ్మఒడి స్కీమ్ ద్వారా ల్యాప్ టాప్ లను పొందే అవకాశం ఉంటుంది. కరోనా మహమ్మారి విజృంభణ తరువాత ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ల్యాప్ టాప్ ల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలను పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ల్యాప్ టాప్ లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం తెచ్చే ల్యాప్ టాప్ లకు మూడు సంవత్సరాల వారంటీ కూడా ఉంటుందని ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే అమ్మఒడి ల్యాప్ టాప్ ఫీచర్లకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తెలుస్తున్న సమాచారం ప్రకారం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంతో పని చేసే ఈ ల్యాప్ టాప్ లో 4జీబీ ర్యామ్, 512 జీబీ హార్డ్ డిస్క్ ఉంటుందని తెలుస్తోంది. నేటి కంప్యూటర్ యుగంలో విద్యార్థులు వెనుకబడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ల్యాప్ టాప్ లను అందుబాటులోకి తీసుకురానుంది. మార్కెట్ లో ఈ ల్యాప్ టాప్ ల ధర 25,000 రూపాయల నుంచి 27,000 రూపాయల మధ్య ఉంటుంది.
అయితే ప్రభుత్వం ఈ ల్యాప్ టాప్ లను కేవలం 18,500 రూపాయలకే అందుబాటులోకి తీసుకురానుందని తెలుస్తోంది. జగన్ సర్కార్ డిగ్రీ విద్యార్థులకు కూడా ల్యాప్ టాప్ లు అందించే దిశగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా ల్యాప్ టాప్ ల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. తక్కువ ధరకే ల్యాప్ టాప్ లు లభిస్తూ ఉండటం వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…