కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి నెలవారీ కనీస స్థూల వేతన పరిమితిని పెంచడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. 15 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయల వరకు పీఎఫ్ డిడక్షన్ లిమిట్ ను కేంద్రం పెంచనుందని తెలుస్తోంది. ఫలితంగా 21,000 రూపాయల లోపు బేసిక్ వేతనం పొందేవారు పీఎఫ్ స్కీమ్ కు అర్హులని చెప్పవచ్చు.
రాబోయే రోజుల్లో పీఎఫ్ మంత్లీ వేతన పరిమితి కూడా భారీగా పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. పీఎఫ్ డిడక్షన్ లిమిట్ పెంపు గురించి కార్పొరేట్ సంస్థలకు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు మధ్య చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలియాల్సి ఉంది. పీఎఫ్ డిడక్షన్ కు సంబంధించి మరో కొత్త నిర్ణయం తెరపైకి వస్తుండగా ఆ నిర్ణయం విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
కేంద్రం 15,000 రూపాయల లోపు వేతనం ఉన్నవారికి వేతనం నుంచి పీఎఫ్ డబ్బులను కట్ చేయవద్దని.. అలా కట్ చేయడం వల్ల తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్రాన్ని కోరుతోంది. పీఎఫ్ డిడక్షన్ లిమిట్ 2014 సంవత్సరం నుంచి 15,000 రూపాయల లోపు బేసిక్ శాలరీ వస్తే కట్ అయ్యే విధంగా ఉంది. ఇప్పుడీ లిమిట్ ను పెంచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014 సంవత్సరానికి ముందు పీఎఫ్ డిడక్షన్ లిమిట్ 6,500 రూపాయలుగా ఉండేది. పీఎఫ్ డిడిక్షన్ లిమిట్ పెంచితే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మరి కేంద్రం బడ్జెట్ లో పీఎఫ్ డిడక్షన్ పరిమితిని పెంచుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…