కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఉద్యోగులకు అదిరిపోయే చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించి నెలవారీ కనీస స్థూల వేతన పరిమితిని పెంచడానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందని తెలుస్తోంది. 15 వేల రూపాయల నుంచి 21 వేల రూపాయల వరకు పీఎఫ్ డిడక్షన్ లిమిట్ ను కేంద్రం పెంచనుందని తెలుస్తోంది. ఫలితంగా 21,000 రూపాయల లోపు బేసిక్ వేతనం పొందేవారు పీఎఫ్ స్కీమ్ కు అర్హులని చెప్పవచ్చు.
రాబోయే రోజుల్లో పీఎఫ్ మంత్లీ వేతన పరిమితి కూడా భారీగా పెరిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. పీఎఫ్ డిడక్షన్ లిమిట్ పెంపు గురించి కార్పొరేట్ సంస్థలకు, కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు మధ్య చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి తెలియాల్సి ఉంది. పీఎఫ్ డిడక్షన్ కు సంబంధించి మరో కొత్త నిర్ణయం తెరపైకి వస్తుండగా ఆ నిర్ణయం విషయంలో కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
కేంద్రం 15,000 రూపాయల లోపు వేతనం ఉన్నవారికి వేతనం నుంచి పీఎఫ్ డబ్బులను కట్ చేయవద్దని.. అలా కట్ చేయడం వల్ల తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని భారతీయ మజ్దూర్ సంఘ్ కేంద్రాన్ని కోరుతోంది. పీఎఫ్ డిడక్షన్ లిమిట్ 2014 సంవత్సరం నుంచి 15,000 రూపాయల లోపు బేసిక్ శాలరీ వస్తే కట్ అయ్యే విధంగా ఉంది. ఇప్పుడీ లిమిట్ ను పెంచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014 సంవత్సరానికి ముందు పీఎఫ్ డిడక్షన్ లిమిట్ 6,500 రూపాయలుగా ఉండేది. పీఎఫ్ డిడిక్షన్ లిమిట్ పెంచితే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మరి కేంద్రం బడ్జెట్ లో పీఎఫ్ డిడక్షన్ పరిమితిని పెంచుతుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…