Featured

కరోనా కంటే భయంకరమైన వ్యాధి.. ఎంతమంది మరణించారంటే..?

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రజలందరినీ గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా విజృంభణకు ముందే ఎన్నో భయంకరమైన వ్యాధులు ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. అయితే కరోనా వేగంగా వ్యాప్తి చెందడం వల్ల ప్రజల్లో ఈ వైరస్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. దాదాపు 47 సంవత్సరాల క్రితం సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో ఒక కొత్త వ్యాధికి సంబంధించిన కేసులకు సంబంధించిన విషయాలను గుర్తించారు.

1965 సంవత్సరంలో లెజియోన్నైర్స్ అనే వ్యాధి శరవేగంగా ప్రబలింది. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి అయిన లెజియోన్నైర్స్ బారిన పడితే శ్వాస అందకపోవడం ప్రజలు గంటల వ్యవధిలోనే చనిపోతారు. ఈ వ్యాధి బారిన పడ్డవారిలో శ్వాస సంబంధిత సమస్యలతో పాటు అనారోగ్యం, విపరీతమైన దగ్గు, నీరసం, జ్వరం, ఇతర లక్షణాలు కనిపించాయి.

అయితే వ్యాధికి సంబంధించిన కీలక విషయాలు దాదాపు పది సంవత్సరాల తర్వాత వెల్లడయ్యాయి. సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో 81 మంది ఈ వ్యాధి బారిన పడి చికిత్స తీసుకోగా బాధిత రోగుల్లో ఏకంగా 14 శాతం మంది మృతి చెందారు. ఒక ప్రమాదకరమైన బ్యాక్టిరియా అప్పట్లో లెజియోన్నైర్స్ వ్యాధి బారిన పడటానికి కారణమైంది. కొందరు ఎవరో కావాలని బ్యాక్టీరియాను విడుదల చేసి ప్రజలను ప్రమాదంలోకి నెట్టారనే ఆరోపణలు సైతం ఆ కాలంలో వ్యక్తమయ్యాయి.

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వ్యాధి గురించి పరిశోధనలు చేయగా బ్యాక్టీరియా ఎయిర్ కండీషన్ రూమ్ లో వ్యాప్తి చెందిందని ఆ సమావేశానికి హాజరైన వారంతా వైరస్ బారిన పడ్డారని సమాచారం. ఆ బ్యాక్టీరియా విజృంభించే ఉంటే మాత్రం కరోనా కంటే ఎక్కువ సంఖ్యలో మరణాలు నమోదై ఉండేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

15 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago