బాలీవుడ్ భామ అలియా భట్ ప్రత్యేకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్న అలియా, ప్రస్తుతం తెలుగులో దర్శకధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్. ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసినదే. ఈ సినిమాలో ప్రముఖ హీరోలయిన రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకొని విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రామ్ చరన్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి పాత్రల పై టీజర్ లు విడుదలయ్యాయి. ఈ టీజర్స్ కి మంచి వ్యూస్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు దర్శక నిర్మాతలు.
అయితే ఈ సినిమాలో అల్లు సీతారామరాజు పాత్రలో, రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ నటించనున్నారు. తాజాగా రామ్ చరణ్, అలియా పై దర్శకుడు కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ముందుగా ఓ పాట చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా అలియా ఈ చిత్ర బృందం కలిసిపోయింది.
అయితే అలియా భట్ తనతో పాటు పదిమంది పర్సనల్ స్టాప్ ను కూడా వెంట తీసుకొచ్చారు. అయితే వీరందరి ఖర్చులు కూడా చిత్ర నిర్మాత భరించాల్సి ఉంటుంది.అలియా స్టాప్ మొత్తానికి కలిపి రోజుకు దాదాపు లక్ష రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుండడంతో నిర్మాతకు బాగానే ఖర్చవుతుందని తెలుస్తుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన అలియాభట్ కోసం చేసేదేమీ లేక నిర్మాత పెద్ద మొత్తంలోనే ఖర్చు చేస్తున్నాడని తెలుస్తోంది.
రోజుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో, అలియా పై ఉన్న సన్నివేశాలను తొందరగా చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు దర్శకుడు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ చిత్రం కోసం నిర్మాత డివివి దానయ్య సుమారు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…