Featured

Analists Dasari Vignan & Damu Balaji : ఆస్తిలో తారకరత్న వాటాని ఆ ట్రస్ట్ కి రాసిచ్చారు… ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసింది తానే…: దాసరి విజ్ఞాన్ & దాము బాలాజీ

Analists Dasari Vignan & Damu Balaji : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఇక ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబానికి దూరమయ్యాడు. ఇక తారకరత్న మృతితో ఆయన భార్య పిల్లలు బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే సంశయం అందరిలోనూ ఉండగా చావు సమయంలో కూడా తారకరత్న తండ్రి కొడుకు ఇంటికి రాకపోవడం వల్ల ఇక అలేఖ్య రెడ్డికి అత్త మామాల సపోర్ట్ ఉండదనే అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ గా మరో వార్త వైరల్ అవుతోంది.

ఆస్తి లో వాటా ట్రస్ట్ కి రాసిన రూప…

మోహన్ కృష్ణ గారు చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అవడం వల్ల కొడుకును ప్రేమ వివాహం చేసుకున్నందుకు పదేళ్ళైనా ఇంకా క్షమించలేదు. ఇక చివరికి కొడుకు మరణించినా కూడా ఆయన కరుగలేదు. తారకరత్న పిల్లలను దగ్గరకు తీసుకోలేదు. అలాంటి మోహన్ కృష్ణ కొడుకు మీద కోపంతో ఆస్తి మొత్తం కూతురు మోహన్ రూప కు రాసిచ్చేసారు. ఇక ఈ విషయం గురించి అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ మాట్లాడుతూ రూప కు ఆస్తి రాసివ్వడం వల్ల అందరూ రూప ను అలా ఎలా ఆస్తి తీసుకుంటావు అంటూ నెగెటివ్ గా మాట్లాడుతున్నారు.

కానీ వాస్తవానికి రూప తన అన్న ఆస్తిని తీసుకుని అన్న తారకరత్న పేరు మీద ట్రస్ట్ పెట్టి సామాజిక కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ చెప్పారు. ఇక ఆ ట్రస్ట్ లో అలేఖ్య రెడ్డిని కూడా భాగస్వామిని చేస్తూ నిర్ణయం తీసుకున్నారట. మోహన్ రూపకు తన అన్న అంటే చాలా ఇష్టమైనా తండ్రి మాట కాదనలేక ఆస్తి తీసుకుని అన్న పేరున ట్రస్ట్ పెడుతోందని దాము బాలాజీ మరియు దాసరి విజ్ఞాన్ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

2 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

3 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

4 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

4 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

5 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

5 hours ago