Parvathi Melton: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పార్వతి మెల్టన్ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో జో అనే పాత్ర ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన పార్వతి మెల్టన్ తన నటనతో మెప్పించారు.
జల్సా సినిమా కన్నా ముందు ఈమె పలు సినిమాలలో నటించిన ఈ సినిమా ద్వారా ఈమెకు ఎంతో గుర్తింపు వచ్చిందని చెప్పాలి.ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ చేసి మెస్మరైజ్ చేశారు. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ ఆమె సందడి చేసిన ఈ పాట అప్పట్లో సంచలనాలను సృష్టించింది.
ఇలా తన సినీ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి పార్వతి మెల్టన్ ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే అవకాశాలు రాక దూరమయ్యారా లేక వ్యక్తిగత కారణాలు వల్ల దూరం అయ్యారు తెలియదు కానీ ఈమె 2013 వ సంవత్సరంలో శంసులాలానిని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.
సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో కాస్త బొద్దుగా ఉన్నటువంటి పార్వతి మెల్టన్ ఇప్పుడు మాత్రం సన్నజాజితీగల గుర్తుపట్టలేని విధంగా ఎంతో నాజుగ్గా తయారయ్యారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…