Parvathi Melton: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పార్వతి మెల్టన్ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో జో అనే పాత్ర ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన పార్వతి మెల్టన్ తన నటనతో మెప్పించారు.
జల్సా సినిమా కన్నా ముందు ఈమె పలు సినిమాలలో నటించిన ఈ సినిమా ద్వారా ఈమెకు ఎంతో గుర్తింపు వచ్చిందని చెప్పాలి.ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ చేసి మెస్మరైజ్ చేశారు. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ ఆమె సందడి చేసిన ఈ పాట అప్పట్లో సంచలనాలను సృష్టించింది.
ఇలా తన సినీ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి పార్వతి మెల్టన్ ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే అవకాశాలు రాక దూరమయ్యారా లేక వ్యక్తిగత కారణాలు వల్ల దూరం అయ్యారు తెలియదు కానీ ఈమె 2013 వ సంవత్సరంలో శంసులాలానిని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.
సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో కాస్త బొద్దుగా ఉన్నటువంటి పార్వతి మెల్టన్ ఇప్పుడు మాత్రం సన్నజాజితీగల గుర్తుపట్టలేని విధంగా ఎంతో నాజుగ్గా తయారయ్యారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…