Analists Dasari Vignan &Damu Balaji : అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారిక రెడ్డి తో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ హత్య చేసి తల, మొండేం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి ప్రియురాలికి వాట్సాప్ లో నవీన్ వేళ్ళను పంపి నిన్ను తాకిన వేళ్ళు ఇవే కదా అంటూ సందేశం పంపాడు. ఇక తరువాత పెదాలను పంపి నిన్ను ముద్దుపెట్టుకున్నది ఈ పెదాలే కదా అంటూ సందేశం పంపగా అందుకు నిహారిక వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో రోజుకో కొత్త కోణం బయటికి వస్తోంది.
నిహారిక అసలు విషయం చెప్పకపోవడం వల్లే ఇదంతా…
అనలిస్ట్స్ దాసరి విజ్ఞాన్ మరియు దాము బాలాజీ నవీన్ హత్య గురించి మాట్లాడుతూ ఈ హత్య విషయంలో నిహారిక రెడ్డి పాత్ర చాలా ఉంది అంటూ అభిప్రాయపడ్డారు. నిహారిక ఒకవైపు ఇంటర్ నుండి నవీన్ ను అలాగే బిటెక్ లో హరిహర ను ప్రేమించిందని ఒకేసారి ఇద్దరినీ ఇష్టపడిన నిహారిక వారితో ఈ విషయం చెప్పలేదు. గత కొద్ది నెలలుగా హరిహర కృష్ణ తో ఎక్కువగా చనువుగా ఉంటున్న నిహారిక నవీన్ తో చేసిన చాట్ గురించి హరిహర కు అనుమానము వచ్చి అడగడంతో నవీన్ తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని చెప్పింది. దీంతో స్నేహితుడైనా నవీన్ మీద పగ పెంచుకున్న హరిహర ఆ విషయం అతనితో మాట్లాడి సెటిల్ చేసుకోకుండా నవీన్ ను చంపాలని అనుకున్నాడు.
అలా మూడు నెలల ముందే ప్లాన్ చేసుకుని పార్టీ అని పిలిచి ఆ పైన గొంతు నులిమి చంపేసి ఆ తరువాత గుండె కోసి ఫోటో తీసి నిహారికకు పంపడం వంటి పైశాచిక పనులను చేసాడు. విషయం నిహారికకు, హరిహర స్నేహితుడు హాసన్ అలాగే హరిహర తండ్రి కి ఆరోజే తెలిసినా హరిహర తండ్రి మొదట తెలియదని, తెలిసిన వెంటనే లొంగిపోమని చెప్పానంటూ చెప్పారు. ఇక నిహారిక, హరిహర, నవీన్ ను ఎలా ఏమరచిందో పోలీసులను అలాగే ఏమారుస్తోందని రెండు సార్లు విచారణకు వచ్చినా ఏమి తెలియదు అంటూనే చెబతోంది అంటూ దాసరి విజ్ఞాన్, దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…
వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…
వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…
రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…
ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…