Analyst Adusumilli Srinivasa rao : అధికారంలో ఎవరు ఉంటే వారికి సపోర్ట్ చేస్తూ కొంతమంది నాయకులు సినిమా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వారి వద్ద స్నేహంగా ఉంటూనే పనులు జరుపుకుంటారు. అయితే నా రూటే సపరేటు అన్నట్లుగా ఉండే మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇక జగన్ వైసీపీ పెట్టిన కొత్తలో కూడా బంధువు అయినా టీడీపీ వైపు ఉండిన మోహన్ బాబు సడన్ గా జంప్ అయి జగన్ మా బంధువు అంటూ చంద్రబాబు ను విమర్శిస్తూ జగన్ పంచన చేరాడు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో నాకెలాంటి గొడవలు లేవు అంటూ వైసీపీ కి దూరంగా జరుగుతున్నాడు. ఈ ఇష్యూ మీద విశ్లేషకులు ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు.
మోహన్ బాబు ముక్కు సూటి కాదు నోటి దూల మనిషి…
ఒకసారి మోహన్ బాబు, శంకర్ రెడ్డి గొడవ పడి కొట్టుకున్నపుడు చంద్రబాబు వద్దకు పంచాయితీ వెళ్లగా చంద్రబాబు ఏదైనా గొడవ ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి కానీ ఇలా కొట్టడం ఏమిటి అంటూ శంకర్ రెడ్డికి సపోర్ట్ చేయడంతో మోహన్ బాబు అప్పటి నుండి చంద్రబాబు మీద కోపం పెంచుకున్నాడు. కానీ అవకాశం కోసం. ఎదురుచూసి జగన్ ద్వారా విమర్శలు మొదలు పెట్టాడు. కానీ జగన్ పంచన చేరినా ప్రయోజనం కలుగలేదు. తన విద్యాసంస్థలకు లబ్ది చేకూర్చుకోవాలనే ఆశ నెరవేరకపోవడంతో మళ్ళీ పక్క చూపులు చూస్తున్నాడు.
అందుకే తాజాగా విశాల్ ‘లాఠి’ సినిమా వేడుకలో చంద్రబాబు అంటే నాకు ఎలాంటి విబేధాలు లేవు అంటూ మాట్లాడాడు అంటూ చెప్పారు. అయితే మోహన్ బాబు ఒక చెల్లని నోటు, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఒరిగేది ఏమి లేదు. జగన్ కి మోహన్ బాబు టీడీపీ లోకి వెళ్లినా వచ్చేదేమి లేదు టీడీపీ కి అతను మళ్ళీ పార్టీలోకి వచ్చినా వచ్చే లాభంలేదు. కానీ చంద్రబాబు ను అన్ని మాటలు అన్న మోహన్ బాబును మళ్ళి టీడీపి పార్టీ లోకి పిలుచుకుంటే అంతకంటే అవమానకరమైన పని ఉండదు అంటూ ఆడుసుమిల్లి గారు అభిప్రాయ పడ్డారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…