Analyst Damu Balaji : నేటి సమాజంలో నేరాలు జరగడానికి ప్రధాన కారణం డబ్బు లేకపోతే వివహేతర సంబంధాలు. ఎక్కువగా వెలుగుచూస్తున్న క్రైమ్స్ వీటి వల్లే జరుగుతున్నాయి. భార్యభర్తల మధ్య మరో వ్యక్తి ఉండటమే చాలా కుటుంబాలలో కలహాలకు కారణమవుతోంది. భార్య భర్తల్లో ఎవరో ఒకరు వేస్తున్న తప్పటడుగు ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఎంతో చక్కగా సాగుతున్న సాయికృష్ణ అనే పూజారి జీవితంలో కూడా వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. సాయి కృష్ణను నేరస్తుడిగా మార్చింది. అప్సర అనే యువతితో పెళ్ళైన సాయికృష్ణ నడిపిన అక్రమ సంబంధం చివరకు అప్సరను సాయి కృష్ణ హత్య చేసేవరకు వెళ్ళింది. అయితే ఈ కేసులో సాయి కృష్ణ భార్య శ్రావణి ఆమె భర్తను వెనకేసుకు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
నా భర్త అటువంటి వాడు కాదు…
సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర తండ్రి కాశిలో పని చేస్తుండగా ఇక్కడ తల్లి వద్దే ఉంది అప్సర. ఇక తనకు ఒక అక్క ఉండగా ఆమెకు పెళ్ళై చెన్నై లో ఉంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం, ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసేవరకు పరిస్థితులు వెళ్లాయి.
కానీ సాయి కృష్ణ భార్య శ్రావణి మాట్లాడుతూ తన భర్త మంచివాడని, ఆడవాళ్లతో బాగా మాట్లాడేవాడే కానీ ఎటువంటి తప్పు చేయలేదని, అప్సర విషయంలో కూడా ఆమె గురించి చెప్పేవాడని అప్సరతో వివాహేతర సంబంధం లాంటివి లేవని ఆమె చనువుగా ఉంటూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడం చేసిందని భార్య తెలిపింది. ఇక అప్సర హత్య తన భర్త చేయలేదని శ్రావణి చెబుతున్నట్లు బాలాజీ తెలిపారు. ఆమె గతం మాకు తెలియదని తన భర్తే హత్య చేసాడని తాను నమ్మడం లేదని శ్రావణి తెలిపారు. ఇక ఈ కేసులో ఆల్రడీ సాయి కృష్ణ తాను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నా ఆయన భార్య శ్రావణి తన భర్త హత్య చేయలేదని మాట్లాడటం విడ్డూరంగా అనిపిస్తోందని అనలిస్ట్ బాలాజీ తెలిపారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…