Analyst Damu Balaji : వివేకానందు రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్నా ఎవరు చంపారనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎం కి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలయక పోవడం పట్ల అటు విపక్షాల నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్నా విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తోంది ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవీ జరగలేదు. అయితే తాజాగా అవినాష్ రెడ్డిని విచారించడానికి సిబిఐ మరోసారి పిలవడం, అవినాష్ రాలేనని చెప్పడం వంటి ఆసక్తికర సంఘటనల నడుమ ఈ కేసులో ఏం జరగనుంది అన్నది అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
అవినాష్ రెడ్డి తల్లికి గుండె పోటు…
మొదటి నుండి కేసులో అవినాష్ రెడ్డి ని వదలని సిబిఐ ఇప్పుడో అపుడో అరెస్టు చేస్తారు అనే కథనాలు వినిపిస్తున్నా ఇంతవరకూ జరగలేదు. అయితే అవినాష్ రెడ్డిని తాజాగా సిబిఐ విచారణకు పిలవగా ఆయన సమయం అడిగినా సిబిఐ వారు ఇవ్వలేదు. అయితే టీడీపీ పార్టీ కి సంబంధించిన మీడియా అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయబోతోందని కథనాలు వరుసగా వేస్తున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
అయితే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు వెళ్లే సమయంలోనే ఆయనకు తల్లి శ్రీలక్ష్మికి గుండె పోటు రావడంతో హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం రావడం, ఆయన వెళ్లడం జరిగిందని అయితే ఈలోగా టీడీపీ మీడియా అవినాష్ పారిపోయాడు, సిబిఐ వెంటపడింది అంటూ కథనాలు అల్లేసారు అంటూ బాలాజీ తెలిపారు. ఆయన పారిపోయినా ఎంపీ కావున ఎక్కడికి వెళ్ళగలరు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక ఆయన సిబిఐ విచారణకు హాజరువ్వకుండా ప్లాన్ చేస్తున్నారంటూ చెబుతున్నారు అది కూడా ఎన్ని రోజులు చేయగలరు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…