Analyst Damu Balaji : తెలుగులో రైటర్ గా పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా మొదలయి, అటు నటుడుగా ఇటు రైటర్ గా కొనసాగుతూ రెండింటిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పోసాని కృష్ణ మురళి. నిజానికి తెలుగు ప్రేక్షకులకు మెంటల్ కృష్ణ అని చెబితే బాగా గుర్తొచ్చే పోసాని విభిన్నంగా విలనిజం చూపిస్తాడు అలాగే విభిన్నంగా కామెడీ పండించగలడు. పరుచూరి బ్రదర్స్ తో పనిచేసే సమయంలోనే వర్మ సినిమాలో అవకాశం వచ్చినా పని పూర్తిగా నేర్చుకున్నాకే చేస్తానని చెప్పి తిరస్కరించిన పోసాని ఆ తరువాత గాయం, నాగార్జున రక్షణ వంటి సినిమాలతో రైటర్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక వెంకటేష్ పెళ్లిచేసుకుందాం, ప్రేమించుకుందాం రా వంటి సినిమాలకు పనిచేసారు. రాజకీయాల్లోనూ యాక్టీవ్ గా ఉన్న పోసాని గారు ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తున్నారు. ఈయన తాజాగా వరుసగా సినిమా ఇండస్ట్రీ వాళ్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఆయన గురించిన పలు ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.
పరుచూరి భార్య మీదే కత్తి దాడి…
పోసాని గారు ఎంఫిల్ చేస్తున్న సమయంలోనే పొట్టకూటి కోసం ఎవరైనా రైటర్ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వాలని అనుకున్నారట. అలా పోసాని గారు పరుచూరి బ్రదర్స్ వద్దకు వెళ్లడం అక్కడ పనికి చేరడం జరిగింది. అక్కడ ఉన్నపుడు ఇంట్లోనే ఉంటూ పరుచూరి బ్రదర్స్ కి సేవలను చేస్తూ రైటర్ గా మెలకువలు నర్చుకుంటున్న సమయంలో మంచి శిష్యుడుగా మెలుగుతున్న సమయంలో ఒక కొత్త హీరో తమ్ముడు ఒక అమ్మాయిని లేపుకువచ్చి పెళ్లి చేసుకోడానికి పోసాని వద్దకు సహాయం కోస వస్తే పోసాని తన రూమ్ లో ఆశ్రయం ఇచ్చాడట.
ఈ వార్త పరుచూరి గోపాల కృష్ణ భార్య విజయలక్ష్మి గారికి ఎవరో తప్పుగా చెప్పడంతో రూమ్ కి అమ్మాయిని తెచ్చుకున్నాడనే అనుమానంతో పోసాని ని బాగా తిట్టి అక్కడి నుండి పంపించేశారట. నిందతో అక్కడినుండి వెళ్ళవలసి రావడం, తనకు వివరణ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదనే కోపంతో విజయలక్ష్మి గారిని పొడవడానికి ఒక కత్తి కూడా కొని కొద్ది రోజులు ఆ ఇంటి వద్ద తిరిగాడట. ఆవేశం చల్లారాక ఆ నిర్ణయం మానుకున్నాడట పోసాని. ఈ విషయాలన్నింటిని అనలిస్ట్ దాము బాలాజీ గారు పంచుకున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…