Shruthi Hassan: శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుని ఎంతో బిజీగాఉన్నారు. అయితే యంగ్ హీరోలతో నటించాల్సిన శృతిహాసన్ ఇలా సీనియర్ హీరోలతో నటిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈమె గురించి గతంలో వార్తలు వచ్చాయి. శృతిహాసన్ పవన్ కళ్యాణ్ చిరంజీవి వంటి సీనియర్ హీరోల సరసన నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇలా బాలకృష్ణ సరసన వీర సింహారెడ్డి చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తున్న సమయంలో ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కేవలం రెమ్యూనరేషన్ కోసమే శృతిహాసన్ ఇలా సీనియర్ హీరోల సరసన నటిస్తుంది అంటూ కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా ఈ విషయం గురించి శృతిహాసన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
శృతిహాసన్ సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఏదైనా ఒక సినిమా ఎంపిక చేసుకుంటున్నాను సినిమాకు సంతకం చేస్తున్నాను అంటే ముఖ్యంగా తను చూసేది సినిమా కథ కథలో తన పాత్ర ప్రాధాన్యత మాత్రమే చూసి సినిమాలకు కమిట్ అవుతానని తెలిపారు.ఇక ఆ సినిమాకు మేకర్స్ ఎవరు? దర్శకుడు ఎవరు హీరో ఎవరు అనే విషయాలను తాను చూడనని తెలిపారు..
ముఖ్యంగా ఆ సినిమాలో నటిస్తున్న హీరో ఎవరు? అతని వయసు ఎంత అతనికి నాకు మధ్య వయసు తేడా ఎంత అనే విషయాల గురించి తాను ఏ మాత్రం పట్టించుకోనని శృతిహాసన్ తెలిపారు. సాధారణంగా లెజెండ్స్ తో నటించే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. బాలకృష్ణ, చిరంజీవి వంటి లెజెండరీ నటులతో నటించినందుకు తాను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా శృతిహాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…