Analyst Damu Balaji : జనసేన అధినేత పిఠాపురంలో ఇచ్చిన స్పీచ్ ను జనసైనికులు ఉహించి ఉండకపోవచ్చు. ఇప్పటివరకు తనకు అధికారం ఇవ్వమని కానీ సీఎం ని చేయండి అని కానీ ఎపుడూ అనని జనసేనాని మొదటి సారి నమ్మెను సీఎం ని చేయండి ప్లీజ్ అంటూ జనాలను కోరుకున్నారు. దోపిడీ దారులకు సీఎం సీటు ఇస్తే ఇలానే దోపిడీ చేస్తుంటారని, నేను బతికుండగా అలాంటి వారికి పదవి రాకుండా చేస్తానంటూ మాటిచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఏపీ ని నెంబర్ వన్ చేస్తా దేశంలోనే అంటూ ప్రకటించారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసైనికులలో నూతనోత్సహం నింపారు. అయితే పవన్ పిఠాపురం స్పీచ్ రాజకీయ వర్గాల స్పందన ఏమిటి, చివరికి పవన్ ఓపెన్ అప్ అయ్యాడా అనే విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
జనం రియాక్షన్ ఏమిటి… పవన్ క్లారిటీతో ఉన్నాడా…
అనలిస్ట్ దాము బాలాజీ పవన్ కళ్యాణ్ వ్యూహల గురించి మాట్లాడుతూ ఆయన మొదటి నుండి క్లారిటీ గానే ఉన్నారు. కానీ ఆయన గురించి మొదటి నుండి ఇతర పక్షాలు కన్ఫ్యూస్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఆయనకు సీఎం పదవి ఆశించలేదని కేవలం చంద్రబాబు ఎలా చెబితే అలా వింటున్నారంటూ మాట్లాడారు. కానీ ఆయన పిఠాపురం సభ అలాంటి వారికి సమాధానం ఇచ్చింది. అంతకు ముందు పవన్ ఇతర సభలలో మాట్లాడినపుడు కూడా నాకు మీరు ఒక ముప్పై సీట్లు ఇచ్చినా నేను టీడీపీ దగ్గర డిమాండ్ పెట్టేవాడిని ఆ ఆప్షన్స్ లేకుండా చేసారు అంటూ చెప్పారు, ఇప్పుడు నేను సీఎం అభ్యర్థిని అంటూ చెప్పారు.
ఇక జగన్ అధికారంలోకి రాకుండా ఎలాగైనా చేస్తానని దోపిడీ దారులకు అధికారం దక్కనివ్వనని చెప్పారు. ఎవరికీ భయపడను అంటూ చాలా ఉద్వేగంగా మాట్లాడారు అంటూ చెప్పారు బాలాజీ. నిజానికి పవన్ మొదటి నుండి క్లియర్ గానే ఉన్నాడు కాకపోతే ప్రత్యర్థులను కన్ఫ్యూస్ చేసారు అంతే అంటూ చెప్పారు బాలాజీ. ఇక ఇప్పుడు కూడా వారాహి యాత్ర ద్వారా తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులలో తన బలం తెలియాలని ఎంతలా ప్రభావితం చేయగలనో చూపిస్తున్నాడు అంటూ బాలాజీ తెలిపారు. జనం కూడా జనసేనాని నుండి కోరుకునే క్లారిటీ ఇదేనంటూ చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…