Analyst Damu Balaji : జనసేన అధినేత పిఠాపురంలో ఇచ్చిన స్పీచ్ ను జనసైనికులు ఉహించి ఉండకపోవచ్చు. ఇప్పటివరకు తనకు అధికారం ఇవ్వమని కానీ సీఎం ని చేయండి అని కానీ ఎపుడూ అనని జనసేనాని మొదటి సారి నమ్మెను సీఎం ని చేయండి ప్లీజ్ అంటూ జనాలను కోరుకున్నారు. దోపిడీ దారులకు సీఎం సీటు ఇస్తే ఇలానే దోపిడీ చేస్తుంటారని, నేను బతికుండగా అలాంటి వారికి పదవి రాకుండా చేస్తానంటూ మాటిచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఏపీ ని నెంబర్ వన్ చేస్తా దేశంలోనే అంటూ ప్రకటించారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసైనికులలో నూతనోత్సహం నింపారు. అయితే పవన్ పిఠాపురం స్పీచ్ రాజకీయ వర్గాల స్పందన ఏమిటి, చివరికి పవన్ ఓపెన్ అప్ అయ్యాడా అనే విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.
జనం రియాక్షన్ ఏమిటి… పవన్ క్లారిటీతో ఉన్నాడా…
అనలిస్ట్ దాము బాలాజీ పవన్ కళ్యాణ్ వ్యూహల గురించి మాట్లాడుతూ ఆయన మొదటి నుండి క్లారిటీ గానే ఉన్నారు. కానీ ఆయన గురించి మొదటి నుండి ఇతర పక్షాలు కన్ఫ్యూస్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఆయనకు సీఎం పదవి ఆశించలేదని కేవలం చంద్రబాబు ఎలా చెబితే అలా వింటున్నారంటూ మాట్లాడారు. కానీ ఆయన పిఠాపురం సభ అలాంటి వారికి సమాధానం ఇచ్చింది. అంతకు ముందు పవన్ ఇతర సభలలో మాట్లాడినపుడు కూడా నాకు మీరు ఒక ముప్పై సీట్లు ఇచ్చినా నేను టీడీపీ దగ్గర డిమాండ్ పెట్టేవాడిని ఆ ఆప్షన్స్ లేకుండా చేసారు అంటూ చెప్పారు, ఇప్పుడు నేను సీఎం అభ్యర్థిని అంటూ చెప్పారు.
ఇక జగన్ అధికారంలోకి రాకుండా ఎలాగైనా చేస్తానని దోపిడీ దారులకు అధికారం దక్కనివ్వనని చెప్పారు. ఎవరికీ భయపడను అంటూ చాలా ఉద్వేగంగా మాట్లాడారు అంటూ చెప్పారు బాలాజీ. నిజానికి పవన్ మొదటి నుండి క్లియర్ గానే ఉన్నాడు కాకపోతే ప్రత్యర్థులను కన్ఫ్యూస్ చేసారు అంతే అంటూ చెప్పారు బాలాజీ. ఇక ఇప్పుడు కూడా వారాహి యాత్ర ద్వారా తన బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులలో తన బలం తెలియాలని ఎంతలా ప్రభావితం చేయగలనో చూపిస్తున్నాడు అంటూ బాలాజీ తెలిపారు. జనం కూడా జనసేనాని నుండి కోరుకునే క్లారిటీ ఇదేనంటూ చెప్పారు.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…