Featured

Analyst Damu Balaji : మహేష్ బాబు కుక్క చనిపోతే మీడియా ఎందుకు ఏడుస్తోంది … ఇదేం జర్నలిజం….: అనలిస్ట్ దాము బాలజి

Analyst Damu Balaji : సోషల్ మీడియా ఒకవైపు ఎలాంటి వార్త అయినా వైరల్ చేసేస్తుంటే మరోవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అలానే తయారైంది. జనాలకు ముఖ్యమైనవి, ఉపయోగపడే వార్తలను వేయడం ఎపుడో మానేసింది. ఒకప్పుడు సెలబ్రిటీలా గురించి తెలుసుకోవాలంటే మ్యాగ్జన్స్ ఉండేవి. ఇపుడు మన న్యూస్ ఛానెల్స్ లోనే అనవసరపు, నిజ నిర్ధారణ లేని వార్తలను బ్రేకింగ్ న్యూస్ అంటూ రోజంతా వేసి జనాల మీద రుద్ధుతున్నారు. పైగా జనాలు చూసేవాటికి ప్రాముఖ్యం ఇస్తున్నాం అంటున్నారు. అయితే జనాలు మాత్రం వాళ్లు వేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా జర్నలిజం వ్యాపారమయం కావడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి న్యూస్ ఛానెల్, పత్రిక రేటింగ్స్, సర్క్యూలేషన్ పోటీలో కొట్టుకుపోతు విలువలు మర్చిపోతున్నాయి. తాజాగా ఒక వార్త మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానెల్ వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది దాని గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మహేష్ బాబు కుక్క చనిపోతే ఏడుస్తున్న మీడియా….

తాజాగా మహేష్ బాబు గారి ఇంట్లో వాళ్ళు పెంచుకుంటున్న ప్లుటో అనే కుక్క చనిపోయింది. ఏడేళ్లుగా పెంచుకుంటున్న కుక్క చనిపోయిందుకు సితార ఇంస్టాగ్రామ్ ద్వారా తన బాధను షేర్ చేసుకుంది. ఇక నమ్రత కూడా కూతురు పోస్ట్ కి కామెంట్ చేస్తూ ఎప్పటికి తనని గుర్తుంచుకుంటాం అంటూ చెప్పారు. అయితే ఈ న్యూస్ ను వేస్తూ జనాల సహనాన్ని పరీక్షిస్తున్నాయి మన ఛానెల్స్ అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆ మధ్య రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టినపుడు, పేరు పెట్టినపుడు కూడా ఇలానే హంగామా చేసింది మీడియా అంటూ బాలాజీ తెలిపారు.

అయితే అపుడు ఇపుడు కూడా జనాల నుండి వినిపిస్తున్న మాట ఇలాంటి పనికిరాని వార్తలు మాకెందుకు అని విసుకుంటున్నారు. దేశంలో ఎన్నో జరుగుతున్నాయి అలాంటి వాటిని కవర్ చేయకుండా ఇలాంటి సెలబ్రిటిల ఇళ్లలో జరిగే చిన్న విషయాలను ఫోకస్ చేయడం ఏమిటని అభిప్రాయాపడుతున్నారు. కానీ నేడు మీడియా అంత వ్యాపార మయం అయినా తరుణంలో అవసరమైన వార్తలు ప్రసారం కావంటు బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago