Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో హీట్ మొదలయింది. వాతావరణం చల్లబడినా రాజకీయ వేడి మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలు అంటూ ఒక వైపు ప్రచారం జరుగుతుండగా తాజాగా సిఎం జగన్ ఢిల్లీ టూర్ లో ఆంతర్యం ఏమైయ్యుంటుందని చర్చలు మొదలయ్యాయి. తాజాగా బీజేపీ తన నాయకత్వాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోను పునఃవ్యవస్ఠీకరించింది. ఏపీ బీజేపీ కి పురందేశ్వరి కి పగ్గాలు అప్పగించి రాజకీయ వ్యూహాలను అమలు చేసింది. ఇక ఒకవైపు జగన్ తో చెట్టా పట్టలేదుకుంటూనే మరోవైపు జనసేన కు చేయి అందిస్తున్న బీజేపీ అసలు మిత్రుడు ఎవరో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. అయితే బీజేపీ, వైసీపీ ఉమ్మడి వ్యూహం ఏపీ లో టీడీపీ లేకుండా చేయడమే అంటూ అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు.
జగన్, మోడీ వ్యూహం అదే…
బీజేపీ అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్న వ్యూహం బలమైన పార్టీతో జతకట్టి బలహీనమైన పార్టీని మింగేయడం అంటూ బాలాజీ చెప్పారు అయితే అదే వ్యూహన్ని ఏపీ లో కూడా అమలు చేస్తున్నారని అందుకే వైసీపీ తో జతకట్టి టీడీపీ ని ఈసారి ఓడించగలిగితే నెక్స్ట్ టీడీపీ బలహీన పడుతుందని అదే వారి వ్యూహం అంటూ చెప్పారు.
అందుకే జగన్ కి ఇటీవల రుణ పరిమితి పెంచి అలాగే నిధులను కూడా అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్నారు అంటూ చెప్పారు. ముందస్తు ఎన్నికల ప్రత్తిపాదన కూడా పెట్టినట్లు, ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగి మళ్ళీ జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు జగన్ తో కలిసి వెళ్లాలని మోడీ భావిస్తున్నట్లు కనిపిస్తోందని బాలాజీ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…