Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, రాజకీయంగా ప్రకంపణలు రేపుతున్నా ఇప్పటికీ అసలు నేరస్థులు బయటికి రాలేదు. కేసులో ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని సిబిఐ ఆరాటపడినా అది జరగలేదు. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.
సీక్రెట్ గా మాట్లాడుకున్న అవినాష్, భారతి…
వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుండి సిబిఐ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. మొదట్లో అవినాష్ రెడ్డి కాల్ లిస్ట్ లో హత్య జరిగిన రోజు భారతి రెడ్డి పిఏ నవీన్ అలాగే జగన్ పిఏ తో మాట్లాడినట్లు ఆధారాలు దొరకడం, అలాగే భారతి రెడ్డితో చాలా సేపు మాట్లాడినట్లు సిబిఐ ఆరోపిస్తోంది.
అయితే తాజాగా అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపిస్తున్నా సిబిఐ మాత్రం అరెస్టు చేయలేదు కానీ భారతి రెడ్డి తో అవినాష్ రెడ్డి రహస్యంగా కలిసి ఏదో మాట్లాడినట్లు వార్తలు బయటికి వినిపిస్తున్నాయి. నిజానికి సిబిఐ నెక్స్ట్ టార్గెట్ అవినాష్ రెడ్డి తరువాత భారతి రెడ్డి అంటూ పలు కథనాలు వినిపిస్తున్నాయని అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. అందుకే అవినాష్ అరెస్టు నేపథ్యంలో భారతి రెడ్డిని కలిసాడని, నెక్స్ట్ ఆమెను కూడా విచారణకు సిబిఐ పిలిచే అవకాశం లేకపోలేదని బాలాజీ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…