Analyst Damu Balaji : తెలంగాణ రాష్ట్రములో కొత్త సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ నుండి తొలిసారి ప్రభుత్వం ఏర్పడటం అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. డిసెంబర్ 7న ఎల్బి స్టేడియంలో అట్టహాసంగా ముఖ్యమంత్రి అలాగే పలు శాఖలకు చెందిన మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. గతంలో కెసిఆర్ మరియు రేవంత్ మధ్య జరిగిన అనేక సంఘటనల నడుమ ఇపుడు రేవంత్ ఎలాంటి రివేంజ్ ప్లాన్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
కాళేశ్వరంలోని అక్రమాలను ఆరా తీస్తున్న రేవంత్…
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రేవంత్ మొదట చేసిన పని సెక్రటేరియట్ బయట అడ్డుగా ఉన్న గేట్ ను తొలగించి ట్రాఫిక్ తో ఇబ్బందిపడుతున్న జనాలకు ఊరటనిచ్చారు. ఇక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులతో సుధీర్ఘ చర్చలను జరిపిన సీఎం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీంతో మాజీ సీఎం కెసిఆర్ ఉచితాల పేరుతో 40వేల కోట్ల అవినీతి చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక కెసిఆర్ మొదటి సారి గెలిచినప్పుడు ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోయినా ఇందులో అవినీతి మాత్రం బాగా జరిగింది.
మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని అపర భగీరథడు అని అనిపించికున్న కెసిఆర్, ఆ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెప్పుకున్నా ఇప్పటివరకు ముప్పై వేల ఎకరాలకు కూడా సాగు నీరు ద్వారా అందించలేకపోయారు. మొదట ప్రాజెక్ట్ వ్యయం 40 వేల కోట్లు కాగా ప్రస్తుతం లక్షా ఇరవైవేల కోట్లకు చేరడమే అవినీతికి నిదర్శనం అంటూ అటు కొంతమంది సామాజిక వేత్తలు అలాగే ఐఏఎస్ అధికారులు, ప్రతిపక్షాలు గొంతు చించుకున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి ద్వారా కెసిఆర్ ను రేవంతబరెడ్డి జైలుకి పంపే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ముందు ముందు తెలంగాణ రాజకీయాలు ఎటువంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…