Analyst Damu Balaji : తెలంగాణ రాష్ట్రములో కొత్త సర్కార్ కొలువుదీరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ నుండి తొలిసారి ప్రభుత్వం ఏర్పడటం అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. డిసెంబర్ 7న ఎల్బి స్టేడియంలో అట్టహాసంగా ముఖ్యమంత్రి అలాగే పలు శాఖలకు చెందిన మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. గతంలో కెసిఆర్ మరియు రేవంత్ మధ్య జరిగిన అనేక సంఘటనల నడుమ ఇపుడు రేవంత్ ఎలాంటి రివేంజ్ ప్లాన్ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
కాళేశ్వరంలోని అక్రమాలను ఆరా తీస్తున్న రేవంత్…
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే రేవంత్ మొదట చేసిన పని సెక్రటేరియట్ బయట అడ్డుగా ఉన్న గేట్ ను తొలగించి ట్రాఫిక్ తో ఇబ్బందిపడుతున్న జనాలకు ఊరటనిచ్చారు. ఇక ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అధికారులతో సుధీర్ఘ చర్చలను జరిపిన సీఎం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. దీంతో మాజీ సీఎం కెసిఆర్ ఉచితాల పేరుతో 40వేల కోట్ల అవినీతి చేసినట్లుగా భావిస్తున్నారు. ఇక కెసిఆర్ మొదటి సారి గెలిచినప్పుడు ప్రారంభించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోయినా ఇందులో అవినీతి మాత్రం బాగా జరిగింది.
మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని అపర భగీరథడు అని అనిపించికున్న కెసిఆర్, ఆ ప్రాజెక్ట్ గురించి గొప్పగా చెప్పుకున్నా ఇప్పటివరకు ముప్పై వేల ఎకరాలకు కూడా సాగు నీరు ద్వారా అందించలేకపోయారు. మొదట ప్రాజెక్ట్ వ్యయం 40 వేల కోట్లు కాగా ప్రస్తుతం లక్షా ఇరవైవేల కోట్లకు చేరడమే అవినీతికి నిదర్శనం అంటూ అటు కొంతమంది సామాజిక వేత్తలు అలాగే ఐఏఎస్ అధికారులు, ప్రతిపక్షాలు గొంతు చించుకున్నాయి. కాగా ఈ ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి ద్వారా కెసిఆర్ ను రేవంతబరెడ్డి జైలుకి పంపే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ముందు ముందు తెలంగాణ రాజకీయాలు ఎటువంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…