Ramesh Reddy : చలన చిత్ర పరిశ్రమలో రచయితగానే కాకుండా నటుడుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు రమేష్ రెడ్డి. ఏదైనా సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వినగానే ఆ సినిమా హిట్టో ఫట్టో చెప్పడం కారణంగా సినీ రంగంలో రెబల్ రమేష్ గా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ తో ముందు నుంచి ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆయనతో ఎక్కువ సినిమాలు చేశారు. అయితే రమేష్ గారు తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పడంతో కొన్ని అవకాశాలు కూడా కోల్పోయానని, ఇక కొన్ని సినిమాలకి తనతో పని చేయించుకుని డబ్బులు ఎగొట్టడం కూడా జరిగిందని సినీ రంగంలో తన అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు.
కథకి కార్ అడిగిన విజయేంద్ర ప్రసాద్…
తన సినీ ప్రయాణంలో తనతో పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఉండటం చాలా సార్లు జరిగిందని, కానీ అలాంటి వాటి గురించి అస్సోసియేషన్ లో ఫిర్యాదు చేయడం, మీడియా ముందుకు రావడం ఎప్పుడూ చేయలేదని చెప్పాడు. తనకు డబ్బు కన్నా తను చేస్తున్న పని అంటే ఇష్టమని అందుకే ఎప్పుడూ గొడవలకు వెళ్లలేదని చెప్పుకొచ్చారు. అలా ఒక డైరెక్టర్ అయితే తను అప్పటికే రాయించుకుంటున్న రైటర్ పని నచ్చక నాకు అయిదు లక్షలు ఎక్కువ ఇస్తానని చెప్పి పని మొత్తం అయిపోయాక డబ్బులు ఇస్తానని వెనుక డోర్ నుండి చెన్నైకి పారిపోయాడని తనకు జరిగిన అనుభవాన్ని చెప్పారు.
ఇక విజయేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడుతూ మన కథకు మనమే గౌరవం ఇవ్వాలి అన్న ఆయన మాటను ఇప్పటికీ మర్చిపోలేనని తన అనుభవాని చెప్పుకొచ్చారు. రవిరాజా దగ్గర పనిచేస్తున్న సమయంలో విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథ బాగుంది అని అది వెంకటేష్ గారి సినిమా కోసం రవిరాజా గారికి ఇస్తానని అడగడం జరిగిందని, అప్పుడు ఆయన సరే ఇవ్వండి కథకు కార్ ఇవ్వమనండి అన్నారు. ఇంకా ప్రొడక్షన్ పనులు కూడా అవ్వలేదు అప్పుడే కార్ అంటే కష్టం అని నేను చెప్పగా కార్ నాకు కాదు నీకు కాదు కథకి, మన కథకి మనమే గౌరవం ఇవ్వాలి అని అన్నారు. అది ఇప్పటికీ నేను మరిచిపోలేని సంఘటన అని రమేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…